1. ఈస్టిండియా కంపెనీ తన రాజకీయ, వ్యాపార విధుల ను వేరుచేస్తూ తెచ్చిన చట్టం ఏది?
ఎ. 1773 రెగ్యులేటింగ్ చట్టం
బి. 1784 పిట్స్ ఇండియా చట్టం
సి.1858 విక్టోరియా రాణి ప్రకటన
డి. 1833 చార్టర్ చట్టం
2. రాజ్యాంగ పరిషత్తు మొదటిసారిగా ఎప్పుడు సమావేశ మైంది?
ఎ.1946 డిసెంబర్ 9
బి. 1949 నవంబర్ 9
సి. 1948 జనవరి 28
డి. 1950 జనవరి 26
3. రాజ్యాంగ పరిషత్తులో నిపుణుల పక్షాన ప్రాతినిధ్యం వహించని వారెవరు?
ఎ. సర్వేపల్లి రాధాకృష్ణన్
బి. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
సి. ప్రొ.కె.టి. షా
డి. శ్రీమతి విజయలక్ష్మి పండిట్
4. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికలో చేర్చిన పదాలు?
ఎ. సామ్యవాద బి. లౌకిక
సి. సమగ్రత డి. సార్వభౌమ
1.ఎ,బి 2. బి,సి 3.ఎ, బి,సి 4. పైవన్నీ
5 . రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేది?
ఎ. 1947 ఆగస్టు 15 బి. 1950 జనవరి 26
సి. 1949 నవంబర్ 26 డి. 1956 జనవరి 26
6. మింటో మార్లే చట్టానికి సంబంధించి సరికాని వ్యాఖ్య
ఎ. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటు
బి. ఈ చట్టానికి 1909 చట్టం అని పేరు
సి. దీనికి మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలని కూడా పేరు
డి. ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిళ్లలో అనధికార మెజారిటీని కలగజేసింది.
7. భారతదేశం ఏ రాజకీయ తరహ వ్యవస్థను ఆచరిస్తుంది?
ఎ. ప్రజాస్వామిక వ్యవస్థ
బి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య తరహా వ్యవస్థ
సి. అధ్యక్ష తరహా వ్యవస్థ
డి. సమాఖ్య తరహా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ
8. భారత రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షత వహించింది ఎవరు?
ఎ. డా|| బి.ఆర్ అంబేద్కర్
బి. రాజేంద్ర ప్రసాద్
సి. జవహర్ లాల్ నెహ్రు
డి. రాజగోపాలచారి
9. ''ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ, ప్రాణం లాంటిదని'' పేర్కొన్నది ఎవరు?
ఎ. బి.ఆర్ అంబేద్కర్ బి. డి.డి బస్
సి. జవహర్లాల్ నెహ్రు
డి. కృష్ణస్వామి అయ్యర్
10. 1935 చట్టానికి సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
ఎ. స్వయం పాలనా పద్ధతిని ప్రవేశపెట్టారు.
బి. ఫెడరల్ కోర్టు తీర్పుపై అప్పీలుకు ఇంగ్లాండులోని ప్రీవికౌన్సిల్కు వెళ్లవలసి ఉంటుంది.
సి. ఈ చట్టం ఆధారంగా దేశంలో మొదటిసారిగా 1937 సాధారణ ఎన్నికలు జరిగాయి.
డి. గాంధీ నాయకత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది.
11. భారత రాజ్యాంగ ప్రవేశిక సాధించవలసిన లక్ష్యం
ఎ. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సమాన హోదా, అవకాశం
బి. ఆలోచన, భావప్రకటన, నమ్మకం, ఆరాధన విషయా ల్లో స్వేచ్ఛ
సి. వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను పెంపొందించు సౌభ్రాతృత్వాన్ని సాధించడం
డి. పైవన్నీ
12. కాంగ్రెస్పార్టీ నాయకులలో క్యాబినెట్మిషన్ ప్రణాళి కకు పూర్తి సుముఖంగా ఉన్నవారెవరు?
ఎ. జవహర్లాల్ నెహ్రు బి. గాంధీ
సి. సర్దార్ వల్లభారు పటేల్
డి. మౌలానా అబ్దుల్కలాం ఆజాద్
13. ఐరిష్ రాజ్యాంగం నుండి గ్రహించినది
ఎ. ఆదేశిక సూత్రాలు బి. ప్రాథమిక హక్కులు
సి. ప్రాథమిక విధులు
డి. అత్యవసర పరిస్థితులు
14. భారత రాజ్యాంగ పరిషత్తుకు ఏ విధమైన ఎన్నికలు జరిగాయి?
ఎ.మతపరమైన ఎన్నికలు
బి. కులపరమైన ఎన్నికలు
సి. పరిమిత ఓటింగ్ పద్దతి
డి.సార్వజనీన ఓటింగు పద్ధతి
15. జవహర్లాల్ నెహ్రు ఉపాధ్యక్షునిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ.1946 సెప్టెంబర్ 2
బి) 1947 ఆగస్టు 15
సి) 1949 జనవరి 26
డి) 1950 జనవరి 26
16. ముసాయిదా కమిటీ సభ్యులు కానివారెవరు?
ఎ. గోపాలస్వామి అయ్యంగారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
బి. కె.ఎమ్ మున్షి, ఎన్. మాధవరావ్
సి. టి.డి కృష్ణ మీనన్
డి. మహమ్మద్ షాద్దుల్లా
17. రాజ్యాంగ పరిషత్తును సూచించిన కమిషన్ ఏది?
ఎ. క్రిప్స్మిషన్ బి. క్యాబినెట్ మిషన్
సి. అట్లీ మిషన్ డి. చర్చిల్ మిషన్
18. రాష్ట్రాలలో ద్వంద పాలనను ప్రవేశపెట్టిన చట్టం
ఎ. 1909 బి. 1919
సి. 1935 డి. 1955
19. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరం
ఎ. 1946 సెప్టెంబర్ 2 బి. 1946 అక్టోబర్ 2
సి. 1946 నవంబర్ 1 డి. 1947 నవంబర్ 1
20. సి.ఆర్. ఫార్ములా దేనికి సంబంధించినది.
ఎ. ప్రజాభిప్రాయం ద్వారా దేశ విభజన చేయడం
బి. మైనారిటీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం
సి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు
డి. పైవేవీకావు
21. భారత ప్రభుత్వ చట్టం 1935
ఎ. రాష్ట్రీయ స్వయం ప్రతిపత్తిని సమకూర్చినది
బి. ఫెడరల్ కోర్టు ఏర్పాటుకు వీలు కల్పించింది
సి. కేంద్రంలో అఖిల భారత సమాఖ్యకు వీలు కల్పించింది
డి. పై అన్నీ సరైనవే
22. కింది అంశాలలో 1935 చట్టంలోని ముఖ్యాంశం ఏది?
ఎ. ఓటుహక్కు
బి. రాజ్యాంగం ఏర్పాటు
సి. సుప్రీంకోర్టు ఏర్పాటు
డి. ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తి
23. క్రిప్స్ ప్రతిపాదనలను దివాళా తీయబోయే బ్యాంకుపై రానున్న తేదీన వేసి ఇచ్చిన చెక్కుగా వర్ణించిన వారు?
ఎ. మహాత్మాగాంధీ బి. నేతాజీ
సి. రాజగోపాలచారి డి. రాజేంద్రప్రసాద్
24. సైమన్ కమిషన్ ముఖ్య ఉద్దేశ్యం.
ఎ.1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణలను సమీక్షించండి.
బి. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించడం
సి. డొమినియన్ ప్రతిపత్తిని సమీక్షించడం
డి. పైవన్నీ
25. రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసిన సంవత్సరం?
ఎ. 1944 బి.1945 సి.1946 డి.1947
26. భారతదేశంలో మత ప్రాతిపదిక, ప్రాతినిద్య పితామ హుడుగా ఎవరిని పరిగణిస్తారు?
ఎ. లార్డ్కర్జన్
బి. లార్డ్ విలియం బెంటింక్
సి.లార్డ్మింట్ డి. ఛేమ్స్ఫర్డ్
27. ఎవరిప్రతిపాదనల మేరకు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటయింది?
ఎ. క్యాబినెట్ ప్రతిపాదనలు
బి. బాటన్ ప్రతిపాదనలు
సి.క్రిప్స్ ప్రతిపాదనలు
డి. పైవేవీకావు
28. ఈ కింది ఏ ప్రతిపాదనను భారత ప్రజల స్వేచ్చా స్వాతంత్రాలకు మాగ్నాకార్టాగా పేర్కొంటారు?
ఎ. వేవెల్ ప్రతిపాదన
బి. క్రిప్సు ప్రతిపాదన
సి. క్యాబినెట్ రాయబార ప్రతిపాదన
డి. విక్టోరియారాణి ప్రకటన
29. 1924 నాటి రిఫార్మ్ ఎంక్వయిరీ కమిటీ చైర్మన్గా పనిచేసినదెవరు?
ఎ. ఛెమ్స్ఫర్డ్ ప్రభువు
బి. అలెగ్జాండర్ మడ్డిమన్
సి. మేయా ప్రభువు
డి. సర్రామ్సే మెక్డోనాల్డ్
30. స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం గణతంత్ర స్వభావం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు?
ఎ. ఫ్రెంచి బి. బ్రిటన్
సి. ఐర్లాండు డి. రష్యా
31. తప్పుగా జతపరిచింది ఏది?
ఎ. అబ్దుల్కలాం ఆజాద్ - ముస్లింలు
బి.ఎచ్.సి ముఖర్జీ - బెంగాలీలు
సి. ఎచ్.సి మోడి -పార్సీలు
డి. ఫ్రాంక్ ఆంథోని -ఆంగ్లో ఇండియన్స్
32. బ్రిటిష్ పార్లమెంటు భారత స్వతంత్ర చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది?
ఎ. 1947 ఆగస్టు 15 బి. 1947 జూన్ 18
సి. 1947 జులై 18 డి.1947 ఏప్రిల్ 18
33. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించినది?
ఎ. జాన్ సైమన్ బి.విన్స్టన్ చర్చిల్
సి. క్లిమెంట్ అట్లీ
డి. సర్రామ్సే మెక్డోనాల్డ్
34. ద్వంద పరిపాలనా విధానంలో ప్రాంతీయ ప్రభుత్వాలకు ఎక్కువ అధికారాలను ఇచ్చిన చట్టం ఏది?
ఎ. ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892
బి. భారత ప్రభుత్వ చట్టం 1909
సి. భారత ప్రభుత్వ చట్టం 1919
డి. గాంధీ ఇర్విన్ ఒడంబడిక
35. క్యాబినెట్ మిషన్ ప్లాన్కు సంబంధించి సరికానిది ఏది?
ఎ. ప్రొవిన్షియల్ గ్రూపింగ్
బి. తాత్కాలిక క్యాబినేట్
సి. పాకిస్తాన్ను అంగీకరించడం
డి.రాజ్యాంగం హక్కును గుర్తించడం
36. భారత ప్రభుత్వ చట్టం 1935 బానిసత్వానికి నూతన పత్రంగా వర్ణించినది?
ఎ. కె.టి.షా బి. జవహర్లాల్ నెహ్రు
సి. మహత్మాగాంధీ
డి. సర్దార్ వల్లభారు పటేల్
37. లార్డ్ బిర్కెన్హుడ్ వ్యాఖ్యకు సమాధానంగా ఏ నివేధికను పేర్కొంటారు?
ఎ. నెహ్రు నివేదిక బి. గాంధీయన్
సి. గోపాలకృష్ణ అయ్యర్ డి. ఏదీకాదు
38. కమ్యూనల్ అవార్డు ముఖ్య ఉద్దేశ్యం
ఎ. హిందూ ముస్లింల మధ్య సయోద్య కుదిర్చే ప్రతిపాదన
బి. మైనారిటీల ప్రాతినిధ్య పథకం
సి. బలహీనుల వర్గాల ప్రత్యేక ప్రాతినిధ్య పరిపాలన
డి. పైవన్నీ
39. లార్డ్లిన్లిత్గో ప్రతిపాదనలకు గల మరొకపేరు
ఎ. ఆగస్టు ప్రతిపాదనలు 1940
బి. సెప్టెంబర్ ప్రతిపాదనలు 1940
సి. అక్టోబరు ప్రతిపాదనలు 1940
డి. ఏదీకాదు
40. మాంటెగ్చెమ్స్ఫర్డ్ నివేదిక ఏ చట్టానికి ప్రతి పాదిక అయింది?
ఎ. భారత శాసన సభల చట్టం -1909
బి. భారత ప్రభుత్వ చట్టం -1919
సి. భారత ప్రభుత్వ చట్టం -1935
డి. భారత స్వాతంత్య్ర చట్టం -1947
41. భారత రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
ఎ.1946 బి.1947 సి.1948 డి.1949
42. మహాత్మాగాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం
ఎ. ఒకటో రౌండ్ టేబుల్ సమావేశం
బి. రెండో రౌండ్ టేబుల్ సమావేశం
సి. మూడో రౌండ్ టేబుల్ సమావేశం
డి. పైవేవీకావు
43. క్యాబినెట్ మిషన్ను భారతదేశానికి ఎందుకు పంపింది?
ఎ. మత ఘర్షణలను అణదొక్కడానికి
బి. ఇండియా పాకిస్తాన్ల మధ్య సరిహద్దులను నిర్ణయించడానికి
సి. రాజ్యాంగ సమస్యకు సరైన సమాధానం కనుగొన డానికి
డి. ఇండియాలో క్రిస్టీయానిటీని ప్రబోధించడానికి
44. భారత రాజ్యాంగ సదస్సుకు ఉపాధ్యక్షుడిగా పని చేసిన వారు ఈ కింది వారిలో ఎవరు?
ఎ. ఎమ్.ఎన్.రారు బి. ఎచ్.సి ముఖర్జీ
సి. గోపాలకృష్ణ
డి. ఎచ్.వి.ఆర్ అయ్యంగార్
సమాధానాలు
1.బి 2.ఎ 3.డి 4.సి 5.బి
6.సి 7.బి 8.బి 9.ఎ 10.డి
11.డి 12.డి 13.ఎ 14.సి 15.ఎ
16.సి 17.బి 18.బి 19.ఎ 20.ఎ
21.డి 22.డి 23.ఎ 24.ఎ 25.సి
26.సి 27.ఎ 28.డి 29.బి 30.ఎ
31.బి 32.సి 33.డి 34.ఎ 35.సి
36.బి 37.ఎ 38.డి 39.ఎ 40.బి
41.ఎ 42.బి 43.సి 44.బి
Authorization