1. ఈ కింది వాటిలో మొట్టమొదటి గిరిజన సభ ఏది?
ఎ) విధాత బి) గణ సి) సమితి డి) సభ
2. ఉపనిషత్తుల సారాంశం ఏమిటి?
ఎ) న్యాయం బి) మతం సి)తత్త్వం డి) యోగ
3. ఈ కింది వారిలో పరిపాలన క్రమాన్ని వరుస క్రమంలో రాయండి?
ఎ) గ్రీకులు, కుషాణులు, శకులు
బి) శకులు, గ్రీకులు, కుషాణులు
సి) శకులు, కుషాణులు, గ్రీకులు
డి) గ్రీకులు, శకులు, కుషాణులు
4. ఈ కింది వారిలో పరిపాలన క్రమాన్ని బట్టి వరుస క్రమంలో అమర్చండి?
ఎ) ఛత్రపతిసాహుజి బి) రాజారాం
సి) శంభాజి డి) శివాజి-2
ఎ) సి,బి,ఎ,డి బి) సి,బి,డి,ఎ
సి) బి, డి, సిఎ డి) ఎ,బి,సి,డి
5. హరప్పా నాగరికతలో మొత్తం శాసనాల సంఖ్య?
ఎ) 4000 బి) 3000
సి) 2500 డి) 6000
6. పురాతన వేదకాలంలో వేదకాల ప్రజలకు తెలియని జంతువు?
ఎ) పంది బి) పులి సి) సింహం డి) ఏనుగు
7. సంగం యుగకాలంలో ''ఉమనార్'' అనగా ఎవరు?
ఎ) దుకాణదారుడు
బి) ఉప్పును అమ్ము చిల్లర వర్తకుడు
సి) సైనిక కమాండర్
డి) వ్యవసాయదారుడు
8) విజయనగర సామ్రాజ్య కాలంనాటి ప్రధాన పండుగ ఏది?
ఎ) ఉగాది బి) శివరాత్రి
సి) దీపావళి డి) మహానవమి
9. విజయనగర కాలంలో గౌడ అనగానేమి?
ఎ) రెవిన్యూ అధికారి బి) రక్షణ అధికారి
సి) గ్రామ ప్రధాన అధికారి డి) చేతి వృత్తుల వారు
10. రాయచూర్ అంతర్వేదిని ఆక్రమించిన బహమని రాజు ఎవరు?
ఎ) ఫిరోజ్షా బి) మహ్మద్ గవాన్
సి) మహ్మద్ షా డి) ఆహ్మద్షా
11. ఈ కింది వారిలో ఏ గుప్తరాజు బౌద్ధమతంలోకి మారి నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు?
ఎ) సముద్ర గుప్తుడు
బి) మొదటి కుమార గుప్తుడు
సి) స్కంధగుప్తుడు
డి) మొదటి చంద్ర గుప్తుడు
12. గుప్తుల కాలంలో 'పుగా' అనగా ఏమిటి?
ఎ) కార్మికుల సంఘం బి) బానిసల సంఘం
సి) వర్తకుల సంఘం డి) వ్యవసాయ కూలీలు
13. ఈ కింది వాటిలో ఏ శాసనం హర్షుడు వల్లభిని ఆక్రమించిన సమాచారాన్ని తెలపింది?
ఎ) జూనాఘడ్ శాసనం బి) ఐహౌల్ శాసనం
సి) దామోదర శాసనం డి) నొసెగి శాసనం
14. ఈ కింది వారిలో విదేశీ రచయితలను వరుస క్రమంలో అమపర్చండి?
ఎ) మెగస్తనీస్ బి) ఫాహియాన్
సి) టాలమీ డి) ప్లీనీ
సరైన దానిని గుర్తించండి
ఎ) ఎ, బి, సి, డి బి) ఎ,సి,బి,డి
సి) బి,సి,ఎ,డి డి) ఎ,డి,సి,డి
15. ఈ కింది వాటిలో ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యం క్షీణిం చుటకు గల కారణం ఏమిటి?
ఎ) బలహీనమైన ప్రభుత్వం
బి) తైమూర్ దండయాత్ర
సి) స్పష్టమైన వారసత్వ విధానం లేకపోవడం
డి) పైవన్నీ సరైనవే
16. తులసీదాస్ 'రామచరిత్ర మానస్' ను ఎవరి కాలంలో రాశారు?
ఎ) అక్బర్ బి) జహంగీర్
సి) శ్రీకృష్ణ దేవరాయలు డి) షాజహాన్
17. బాబర్ ప్రారంభంలో ఎక్కడి నుండి భారతదేశానికి వచ్చాడు?
ఎ) కరోసాన్ బి) ఫర్ఘనా సి) కోల్దివ డి) కైరా
18. ఈ కింది వారిలో ఏ మొగల్ చక్రవర్తి కాలంలో దక్షిణ ప్రాంతంలోని తమిళభూభాగం వరకు విస్తరించెను?
ఎ) షాజహాన్ బి) అక్బర్
సి) జౌరంగ జేబు డి) హుమాయున్
19. శివాజీ చిన్నతనంలో అత్యంత ప్రభావం చూపిన ముఖ్యమైన వారు ఎవరు?
ఎ) జిజియాభాయి (గురువు)
బి) షాజీ భోంస్లే(తండ్రి)
సి) దాదాజీ కొండదేవ్ (గురువు) డి) పైవారందరూ
20. శివాజీ పరిపాలనలో ఆర్థిక మత్రిని ఏమని పిలిచేవారు?
ఎ) అమాత్య బి) సమంత
సి) మత్రి డి) పండితరావ్
21. శివాజీ అష్టప్రధానుల్లో'సేనాపతి'కి కల మరొక పేరు ఏమిటి?
ఎ) ముజుందార్ బి) సచివ
సి) సర్-ఇ-నౌబల్ డి) దబీర్
22. ఈ కింది వారిలో ఆగ్రా మోతీ మసీదును నిర్మించింది ఎవరు?
ఎ) అక్బర్ బి) షాజహన్
సి) జహంగీర్ డి) ఔరంగజేబు
23. ఈ కిందివారిలో మరాఠా పాలకుల్లో చాణుక్యుడు అని ఎవరిని అంటారు?
ఎ) బాలాజీ విశ్వనాథ్ బి) మహదాజి సిందియా
సి) రెండో బాజిరావ్ డి) నానా ఫడ్నవీస్
24. ఈకింది వారిలో ఎవరిని 'బొంబాయి త్రయం'గా పిలుస్తారు?
ఎ) బాలగంగాధర్ తిలక్, గోఖలే, జోషి
బి) నౌరోజీ, ఆర్.జి. భండార్కర్, కె.టి. తెలంగ్
సి) ఫిరోజ్షా మెహతా, కె.టి. తెలంగ్, బద్రుద్దీన్ త్యాబ్జి
డి) తిలక్, నౌరోజి, ఫర్దూంజీ
25. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) బాంబే సమాచార్- గుజరాత్ మొదటి పత్రిక
బి) దిగ్ధర్శన్ - మొదటి బెంగాలి పత్రిక
సి) మద్రాస్ మొయిల్ - మొదటి సాయంకాల పత్రిక
డి) పైవన్నీ సరైనవే
26. ఈ కింది వాటిలో 1856 సంవత్సరంలో అమలులోకి వచ్చిన అంశం ఏది?
1) మత పరమైన వైకల్యాల చట్టం
2) రాజ్య సంక్రమణ సిద్ధాంతం
3) సతీ నిషేధ చట్టం
3) హిందూ వివాహ చట్టం
సరైన దానిని గుర్తించండి?
ఎ) 1,2, 4 బి) 2, 4
సి) 2, 3, 1 డి) 1, 4
27. 1893 సంవత్సరంలో ప్రపంచ సర్వమత సమ్మేళనం ఎక్కడ జరిగింది?
ఎ) వాషింగ్టన్ బి) చికాగో
సి) న్యూయార్క్ డి) పెంటగాన్
28. ఈ కిందివారిలో అహర్ ఉద్యమంలో శాశ్వత సభ్యు లను గుర్తించండి?
1) హకిం అజ్మల్ఖాన్ 2) సయ్యద్ నాజర్ హుస్సేన్
3) హసన్ ఇమమ్ 4) మౌలానా జాఫర్ ఆలీఖాన్
5) చిరాగ్ అలీ 6) మహజర్ ఉల్ హక్
ఎ) 1, 2, 3, 4 బి) 1, 3, 4, 6
సి) 1, 6 డి) 2, 4, 6
29. ఈ కింది ఏ చట్టం ద్వారా అధికారికంగా విద్యను భారత నియంత్రణలోకి తీసుకొచ్చారు?
ఎ) భారత ప్రభుత్వ చట్టం - 1919
బి) భారత ప్రభుత్వ చట్టం- 1909
సి) భారత ప్రభుత్వ చట్టం - 1935
డి) ఇండియన్ కౌన్సిల్ చట్టం - 1892
30. ఈ కింది వాటిలో సరైన దానిని గుర్తించండి?
ఎ) దీనబంధు - సి.ఆర్.దాస్
బి) దేశ బంధు- సి.ఎఫ్. ఆండ్రూస్
సి) షేర్-ఇ-పంజాబ్ డి) పైవన్నీ సరైనవే
31. ఈ కింది వారిలో ఏ ఇంగ్లీష్ అధికారి జహంగీర్కు ఖాన్ అనే బిరుదును ఇచ్చారు?
ఎ) రాల్ఫ్ పిచ్ బి) సర్ థామస్ రో
సి) హకిన్స్ డి) ఎడ్విన్ ఆడ్రిన్
32. పంజాబ్ హిందూ సభను స్థాపించిన సంవత్సరం ఏది?
ఎ) 1947 బి) 1909 సి) 1905 డి) 1924
33. ఈ కిందివాటిలో సరైన దానిని గుర్తించండి?
ఎ) ది ఇండియన్ అన్రెస్ట్- లోకమాన్య తిలక్
బి) అన్ బ్రిటీష్ ఇండియా- దాదాబాయి నౌరోజీ
సి) ది ఫస్ట్వార్ ఆఫ్ ఇండిపెండెన్స్- వి.డి. సావర్కర్
డి) పైవన్నీ సరైనవే
34. బ్రిటీష్ వారి కాలంలో మొట్టమొదటి లా కమిషన్ ఎవరి కాలంలో ఏర్పాటు చేశారు?
ఎ)మెకాలే బి) మెట్కాఫ్
సి) విల్లింగ్టన్ డి) అచ్చిసన్
35. 1922 డిసెంబర్ 16 నాడు ఇండిపెండెంట్ పార్టీని స్థాపించింది ఎవరు?
1) లాలా హరదయాళ్
2) మోతీలాల్ నెహ్రూ
3) మదన్ మోహన్ మాలవ్య
4) మహ్మద్ ఆలీ జిన్నా
ఎ) 1, 2 బి) 2, 4 సి) 2, 3 డి) 1, 4
36. ఈ కింది వారిలో బాంబే త్రయం కాని వారిని గుర్తించండి?
ఎ) కె.టి.తెలాంగ్ బి) దాదాబాయి నౌరోజీ
సి) ఫిరోజ్ షా మోహతా డి) బబ్రుద్దీన్ త్యాబ్జీ
37. ఈ కిందివాటిలో సరై జతను గుర్తించండి?
ఎ) హిందూ స్వరాజ్ - మహాత్మగాంధీ
బి) ది ఇండియన్ స్ట్రగుల్- సుభాష్ చంద్రబోస్
సి) ఏ నేషన్ ఇన్ మేకింగ్- సురేంధ్రనాథ్ బెనర్జీ
డి) పైవన్నీ సరైనవే
38. ఈ కిందివారిలో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షు డు కానివారు ఎవరు?
ఎ) జవహర్ లాల్ నెహ్రు
బి) బాలగంగాధర్ తిలక్
సి) బద్రుద్దీన్ త్యాబ్జీ
డి) మోతీలాల్ నెహ్రు
39. ఈ కింది స్థాపించిన సంస్థలను సరైన క్రమంలో రాయండి?
ఎ) బ్రహ్మసభ- ఆర్యసమాజ్- మద్రాస్ మహజన సభ
బి) మద్రాస్ మహజనసభ- బ్రహ్మసభ- ఆర్యసమాజ్
సి) మద్రాస్ మహజనసభ- ఆర్యసమాజ్- బ్రహ్మసభ
డి) బ్రహ్మసభ- మద్రాస్ మహజన సభ- ఆర్య సమాజ్
40. ఈ కింది వాటిలో తప్పుగా జతపర్చినది ఏది?
ఎ) ప్రార్థన సమాజం- డా. ఆత్మరాం పాండురంగ
బి) భారతీయ బ్రహ్మ సమాజం- కేశవ చంద్రసేన్
సి) సాదారణ బ్రహ్మసమాజం-రజనీకాంత్ సేన్
డి) ఆది బ్రహ్మసమాజ్- దేవేంద్రనాథ్ ఠాగూర్
41. ఈ కింది వారిలో బాంబే ల్యాండ్ అసోసియేషన్ ప్రారంభించింది ఎవరు?
ఎ) బి.పి.వాడియా
బి) ఛత్రపతి సాహుజీ మహరాజ్
సి) రాజరామ్మోహన్ రారు
డి) ఎన్.ఎం. రారు
42. ఈ కింది వాటిలో సరిగా జతపరచనిది ఏది?
ఎ) కిసాన్ సభ- ఉత్తర ప్రదేశ్
బి) మోప్లా తిరుగుబాటు- కేరళ
సి) పబ్నా వ్యయసాయలీగ్ - మహరాష్ట్ర
డి) బార్డోలి సత్యాగ్రహ- గుజరాత్
43. ఈ కింది వారిలో 'దిలాస్ట్ మొగల్ దిపాల్ ఆఫ్ ఏ ఢిల్లీ డైనాస్టి ఇన్ 1857' పుస్తక రచయిత ఎవరు?
ఎ) థామస్ విల్సన్
బి) విలియం దార్లిమ్పుల్
సి) విలియం డిగ్బీ
డి) ఆర్.జి. భండార్కర్
44. భారతదేశంలో హత్య చేయబడిన ఏకైక వైస్రారు ఎవరు?
ఎ) లార్డ్ ఎల్జిన్ బి) డిఫిన్
సి) లార్డ్ మేయో డి) జాన్ లారెన్స్
45. ఈ కింది వారిలో 1839సవంత్సరంలో కలకత్తా నుండి ఢిల్లీ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్ నిర్మాణం ప్రారంభించింది ఎవరు?
ఎ) లార్డ్ అక్లాండ్ బి) లార్డ్ వెల్లస్లీ
సి) కారన్ వాలీస్ డి) లార్డ్ వెవేల్
47. ఈ కింది వారిలో ఎవరు బెంగాల్ లోని హుగ్లీలో ఫ్యాక్టరీ స్థాపించుటకు అనుమతి జారీ చేశారు?
ఎ) ముర్షిద్ కులీఖాన్ బి) షాఘజా
సి) సర్ఫరాజ్ ఖాన్ డి) ఆలీవర్దీఖాన్
48. ఈ కింది వారిలో బీహార్కు డిప్యూటీ దివాన్ను రాబర్ట్ క్లైవ్ ఎవరిని నియమించాడు?
ఎ) రాజా సితాబ్రారు బి) మాణిక్చంద్
సి) రారు దుర్లబ్ డి) షాజుద్దీన్
సమాధానాలు
1.ఎ 2.సి 3.డి 4.ఎ 5.బి
6.సి 7.బి 8.బి 9.సి 10.ఎ
11.బి 12.సి 13.బి 14.డి 15.డి
16.ఎ 17.బి 18.సి 19.డి 20.ఎ
21.సి 22.బి 23.డి 24.సి 25.డి
26.డి 27.బి 28.బి 29.ఎ 30.డి
31.సి 32.బి 33.డి 34.ఎ 35.సి
36.సి 37.డి 38.బి 39.ఎ 40.సి
41.డి 42.సి 43.బి 44.సి 45.ఎ
46.ఎ 47.బి 48.ఎ
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
Authorization