Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో క్లాస్రూమ్కు ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ విద్య అద్భుత ఫలితాలు ఇస్తున్నదనే ప్రచారం కొనసాగుతున్నది. విద్యార్థులు తరగతి గదుల్లో ఎంత నాణ్యమైన విద్యను అభ్యసి స్తున్నారనే అంచనాకు సరైన కొలబద్దలేదు. మార్కులే ప్రమా ణంగా భావించలేం. పాఠశాల వాతావరణం, కోర్సు, పాఠ్య ప్రణాళిక, ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం విద్యార్థి మానసిక పరిపక్వతకు ప్రధానంగా దోహద పడతాయి. కోవిడ్ మహమ్మారి ప్రపంచ విద్యారంగాన్ని అతలా కుతలం చేసింది. విద్యార్థుల చదవులు ఆలస్యం కారాదనీ, సాధ్యమైనంత తొందరగా చదువు చెప్పాలన్న మేథావుల సూచనల మేరకు ప్రభుత్వాలు, విద్యాసంస్థలు కదిలాయి. తరగతి గదిలో ప్రత్యక్షంగా కూర్చుని విద్యనభ్యసించే అవకాశం ఇంకా లేదనే పేర ఆన్లైన్ తరగతులు ప్రత్యామ్నాయంగా ముందు కొచ్చాయి. ఇవి ఎంతమేరకు నాణ్యమైనవనే సందేహాలూ ఉన్నాయి. పాఠాలు అర్థమవుతున్నాయా ? ప్రాథమిక విద్య నుంచి పరిశోధక స్థాయి వరకు ఆన్లైన్ విద్యనే సాగుతున్నది. కేంద్రీయ, నవోదయ విద్యాల యాలతోపాటు రాష్ట్రాల స్థాయి లోని ప్రభుత్వ, ప్రయివేటు బడులూ ఆన్లైన్ బాట పట్టాయి. కొన్ని కళాశాలలు, పాఠశాలలు డిజిటల్ బోధన ప్రారంభించి నాలుగు నెలలైంది. భాషలు, సాంఘిక శాస్త్రాల బోధనపై కొంత వరకు బాగానే ఉన్నా, గణితం, సైన్స్, సాంకేతిక సబ్జెక్టులపై అనుమానాలున్నాయి. తరగతి గదిలో చెప్పే పాఠాలు కొన్నింటిని ఆన్లైన్ ద్వారా చెప్పడం కష్టమనీ, సమీక్ష అవసరమని యూజీసీ, ఎస్సీఈఆర్టీలు ఇప్పటికే చెప్పాయి. పాఠాలు చెప్పడమే తప్ప, కింది స్థాయిలో విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడనే విషయమై సరైన సమీక్ష ఇప్పటికీ లేదు. కేంద్రీయ పాఠశాలల్లో సాగుతున్న ఆన్లైన్ బోధన నాణ్యతపై ఎన్సీఈఆర్టీ జరిపిన సర్వేలో 35 శాతం విద్యార్థులకు పాఠాలు అర్ధం కావడం లేదని తేలింది. 21 శాతం పిల్లలకు కంప్యూటర్, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్లు లేవు. కరెంటు సమస్యలు , ఇంటర్నెట్ లోపాలతోపాటు చిన్న స్క్రీన్లతో కంటి చూపు, ఫిట్స్ తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేగాక లాక్డౌన్ నేపథ్యంలో పిల్లలు పనికి పోయే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అనుమతులు లేకుండా ఆన్లైన్ పాఠాలకు తెరలేపిన ప్రయివేటు పాఠశాలల తీరుపై రాష్ట్ర హైకోర్టు స్పందిస్తూ ఈ తరహా బోధన వల్ల పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందా ? అని ప్రశ్నించింది. పాఠశాల స్థాయిలో లక్షలాది విద్యార్థులకు పాఠాలు చెప్పే ప్రక్రియను దూరదర్శన్, రేడియో ద్వారా చేపట్టారు. ఇద్దరు విద్యార్థులున్న కుటుంబంలో ఒకే పోన్లో పాఠాలు వినడమూ సమస్యగా మారింది. అసలు ఏ మేరకు శ్రద్ధ పెడుతున్నారనేది ప్రశ్నార్థకం. పరిస్థితులు కొలిక్కివచ్చాక ఇవే పాఠాలు తరగతి గదుల్లో ప్రత్యక్షంగా మళ్ళీ చెబుతారా అనేదీ తేలాల్సి ఉంది. మరోవైపు విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు అర్థంకాక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఆన్లైన్ పద్ధతిలో ఎన్ని పాఠాలు చెప్పాలి, తరగతులు ప్రారంభమైతే ఎన్ని బోధించాలి, థియరీ ఎంత, ప్రాక్టిల్సు ఎలా తదితర అంశాలు టీచర్లను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఉపాధ్యాయుల ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడంతో పరీక్షలు జరుగుతాయా ? లేదా ? అనే సందేహాలూ విద్యార్థుల్లో నిర్లక్ష్య ధోరణికి కొంత కారణమని అంటున్నారూ. దేశంలో కనీసం 60 శాతం విద్యార్ధులకు ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో లేవని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ఇది సమాజంలో పేద వర్గాల పిల్లలకు ఇతర వర్గాల పిల్లలకు మధ్య ఉన్న అంతరాన్ని కండ్లకు కట్టినట్టు చూపెట్టింది. తల్లితండ్రులు ఆన్లైన్ విద్యపై పూర్తి అసంతప్తితో ఉన్నారు. వీలైనంత తొందరగా బడులు తెరవాలని కోరుకుంటున్నారు. అలాగే 60 శాతం తల్లిదండ్రులకు దీనిపై అవగాహన లేదు. 90 శాతం టీచర్లూ తలనొప్పిగా భావిస్తున్నారు.
పిల్లల విద్యపై పర్యవేక్షణ సరిగ్గా ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితి పేద విద్యార్థుల్లో ఆత్మన్యూనతను పెంచుతుందని ఇటీవల ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించిన సంగతీ తెలిసిందే. విద్యార్థుల ఉప కార వేతనాల బడ్జెట్ నుంచి ఆన్ లైన్ విద్యకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నించాలి. తరగతి గది విద్య మళ్లీ ప్రారంభమయ్యే వరకు విద్యాసంవత్సరం కోల్పోకుండా సాధ్యమైనంత నాణ్యమైన బోధన చేయాల్సిన బాధ్యతా ఉపాధ్యాయులదే. ఆరు నెలలుగా ఇంటిపట్టునే ఉంటున్న విద్యార్థుల మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని పాఠాలు చెప్పాలనే డిమాండూ ఉంది. కోవిడ్ సాకుతో ఆన్లైన్ విద్య పేద విద్యార్థులను చదువుకు దూరం చేయడమేననే వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇదే తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన విద్యావిధానం పేదలు, బడుగు, బలహీనవర్గాలకు శాపంగా మారుతుందనే ఆందోళన సైతం వ్యక్తమవుతున్నది.