Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశం గర్వించదగ్గ ఆర్థికవేత్తలలో ఒకరు, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్పై బురద చల్లేందుకు బీజేపీ - ఆరెస్సెస్ ఆడుతున్న నాటకం వెగటు పుట్టిస్తోంది. ''నవ్విపోదురు గాక నాకేటి సిగు'' అన్న చందంగా బీజేపీ నిస్సిగ్గుగా నిరాధారమైన ఆరోపణలతో ఆయనపై దాడికి దిగింది. శాంతి నికేతన్కు చెందిన స్థలాలను అక్రమంగా ఆక్రమించిన వారి జాబితాలో అమర్త్యసేన్ పేరును చేర్చుతూ గతవారం విశ్వభారతి యూనివర్సిటీ వైస్ చాన్సలర్ బిద్యుత్ చక్రవర్తితో చేయించిన ప్రకటన ఈ దుష్ట పన్నాగంలో భాగమే.
భారతదేశానికి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులార్జించి పెట్టిన ప్రముఖ ఆర్థికవేత్త, 87ఏండ్ల ఈ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ను పట్టుకుని భూ కబ్జాదారుడుగా చిత్రించడంపై విద్యార్థులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులే కాదు, దేశవ్యాపితంగా మేథావులు, ప్రముఖుల నుంచి తీవ్ర నిరసనాగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. అమర్త్యసేన్ గొంతు నొక్కేందుకే కాషాయశక్తులు ఇటువంటి నీచమైన ప్రచారానికి ఒడిగట్టాయనేది బహిరంగ రహస్యమే.. మోడీ ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించడమే ఈ ప్రొఫెసర్ చేసిన నేరం అన్నట్టుగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ''రాజకీయాల ప్రస్తావన చేయకుండా ఉంటే ఇటువంటి వివాదాలు రావు కదా'' అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇది వారి అప్రజాస్వామిక, నియంతృత్వ పోకడలకు ప్రతీక.
అమర్త్యసేన్ లాంటి ప్రముఖ మేధావిని ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో శాసించే హక్కు వీరికెవరిచ్చారు? హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే మతతత్వశక్తులకు బెంగాల్లో చోటివ్వరాదని అమర్త్యసేన్ తరచూ పిలుపునిస్తుంటారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో మోడీ ప్రభుత్వం ఆడుతున్న కపట నాటకాన్ని అమర్త్యసేన్ ఎండగడుతున్నారు. ప్రజా ఉద్యమాలను బలపరుస్తుంటారు. ప్రభుత్వాల విధాన లోపాలను ఎత్తిచూపుతుంటారు. స్వావలంబనకు ఆయువుపట్టుగా ఉన్న నవరత్నాలను, ఈ దేశంలోని అపారమైన సహజవనరులను ఒకవైపు విదేశీ, స్వదేశీ గుత్త పెట్టుబడిదారులపరం చేస్తూ మరో వైపు స్వావలంబన గురించి మాట్లాడటం మోడీ నయవంచనకు నిదర్శనం. మోడీ ప్రభుత్వ దుష్ట విధానాలను విమర్శిస్తే దేశద్రోహులు, జాతి వ్యతిరేకులన్న ముద్రవేసి జైళ్లలో పెడుతోంది. 2015లో నలంద విశ్వవిద్యాలయం చాన్సలర్ స్థానం నుంచి అమర్త్యసేన్ను అవమానకరమైన రీతిలో తొలగించిందీ ప్రభుత్వం. అవినీతి, బంధుప్రీతికి పాల్పడ్డారంటూ అన్యాయంగా ఆయనపై నిందలు మోపింది. ఇప్పుడు విశ్వభారతి వైస్చాన్సలర్ చేసిన ఆరోపణలు కూడా అలాంటివే. ప్రతీచి ట్రస్టు దీర్ఘకాలికంగా లీజుకు తీసుకున్న స్థలంలోనే ఉందనడానికి అవసరమైన లీజు డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని, లీజు గడువు ఇంకా చాలా కాలం ఉందని అమర్య్తసేన్ స్పష్టం చేసిన తరువాత కూడా బీజేపీ ఈ తప్పుడు ప్రచారాన్ని అదే పనిగా కొనసాగించడంలో ఆంతర్యం తెలియనిదేమీ కాదు.
వచ్చే ఏప్రిల్ - మే నెలల్లో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలంటే బెంగాల్ లౌకిక సంస్కతిని మొదట ధ్వంసం చేయాలి. ఆ సంస్కతికి ప్రతీకగా ఉన్న వ్యక్తులను, శక్తులను దెబ్బతీయాలి. ఇదీ బీజేపీ కుటిల పన్నాగం. రవీంద్రనాథ్ టాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద వంటి మహాపురుషులంతా లౌకిక బెంగాలీ సంస్కతిని పెంపొందించేందుకు కషి చేశారు. మమతా బెనర్జీ నేతత్వంలోని తణమూల్ కాంగ్రెస్ అవకాశవాదంతో బీజేపీతో గతంలో పొత్తుపెట్టుకుంది. ఫలితంగా బెంగాల్లో హిందూత్వ శక్తులు వేళ్లూనుకునేందుకు అవకాశమిచ్చింది. ఇప్పుడు అవే శక్తులు లౌకిక సంస్కతిపై బాహాటంగా దాడికి దిగుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో 18లోక్సభ స్థానాలు తన ఖాతాలో పడడంతో బీజేపీ కన్ను మిన్ను కానకుండా వ్యవహరిస్తోంది. సత్యం ఎప్పుడూ మతతత్వ శక్తులకు వ్యతిరేకంగానే ఉంటుంది. అందులోనూ నిత్యం అసత్యాలతో బతికే బీజేపీ, ఆరెస్సెస్ వంటి ఫాసిస్టు శక్తులకు సత్యం అంటేనేగిట్టదు. అందుకే సత్యాన్ని సమాధి చేయాలని అవి నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. అటువంటి శక్తులను బెంగాల్ ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి. తమ లౌకిక వారసత్వ సంపదను పదిలంగా కాపాడుకోవాలి. వామపక్ష సంఘటనను బెంగాల్లోని లౌకిక శక్తులన్నీ బలపరచడమే మతతత్వ శక్తుల దాష్టీకాన్ని నిలువరించగల మార్గం.