Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ఉచ్చులో ఎంతోమంది ఉన్నతాధికారులు బలిపశువులవుతున్నారు. తాజాగా ఆ జాబితాలో సీబీఐ తాత్కాలిక మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు చేరారు. మోడీ ఆడమన్నట్టు ఆడి సుప్రీంకోర్టు చేత చివాట్లు ఎదుర్కోవడం దురదృష్టకరం. బీహార్లోని ముజఫర్పుర్ షెల్టర్ అత్యాచారాల కేసులో కోర్టు అనుమతి లేకుండా బదిలీలు చేయడంపై మంగళవారం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోరు, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సీరియస్గా స్పందించింది. కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే ఒక మూలన కూర్చోవాలంటూ ఆదేశించింది. లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. నాగేశ్వరరావు నివేదించిన క్షమాపణనూ తిరస్కరించింది. ప్రభుత్వ అధికారులు చట్టానికి లోబడి పని చేయాలనీ, రాజకీయ నాయకులకు కాదని సీజే పేర్కొనడం ఓ హెచ్చరిక. కోర్టు ఆదేశాలతో ఆటలాడుకుంటే ఎలాంటి పరిమాణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో న్యాయస్థానం రుచి చూపించింది. మోడీ ప్రభుత్వంలో ఉన్నతచదువులు చదివి మంచి గుర్తింపు పొందిన ఉన్నతాధికారులకు అవమానాలే మిగులుతున్నాయి. ఆర్బీఐలో రఘరామ్రాజన్, ఉర్జిత్పటేల్, నితిఅయోగ్ వైస్చైర్మెన్ అరవింద్ పనాగరియా, సీబీఐ చైర్మెన్గా పనిచేసిన ఆలోక్వర్మ వంటి వారు అవమానకరంగా బయటకు వెళ్లాల్సి వచ్చింది. వారంతా మోడీ ప్రభుత్వ చర్యలను సహించలేక నిష్కృమిస్తే, నాగేశ్వరరావు కోర్టు ఆదేశాలతో తలదించుకోవాల్సి వచ్చింది.
మోడీ ప్రభుత్వం వచ్చాక తన రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగ సంస్థల గౌరవ ప్రతిష్టలను దిగజార్చింది. స్వతంత్ర సంస్థలైన సీబీఐ, ఆర్బీఐలతో పాటు ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసింది. కొంతమంది అధికారులను కూరలో కరివేపాకు మాదిరి వాడుకుంటోంది. సీబీఐలో చెలరేగిన అంతర్యుద్ధంలో తాత్కాలిక డైరక్టర్గా మన్నెం నాగేశ్వరరావును మోడీ నియమించారు. సీబీఐ డైరక్టర్గా ఉన్న అలోక్వర్మ తనమాట వినకుండా రాపెల్ స్కామ్పై విచారణ జరుపుతారన్న భయంతో మోడీ ఆయనను పంపించేశారని ప్రచారం జరిగింది. రాత్రికిరాత్రి నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించి ముఖ్యమైన అధికారులందర్ని బదిలీ చేయించడం అప్పట్లో సంచలనమైంది. తనచేతికి మట్టి అంటకుండా కేంద్రం తాత్కాలిక డైరెక్టర్ చేత పని కానిచ్చేసింది. ఇలా బదిలీ చేసిన అధికారుల్లో ముజఫర్పుర్ సీబీఐ అధికారి కూడా ఉన్నారు. ఆయన బీహార్ అధికార పార్టీకి చెందిన ఓ నేత చిన్న పిల్లలను లైంగికంగా వేధించిన కేసును దర్యాప్తు చేస్తున్నారు. బీహార్లో నితీష్కుమార్ ఆధ్వర్యంలోని జనతాదళ్(యు) ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇస్తున్నది. ముజఫర్పుర్ సహా బీహార్లోని 17 రక్షణ గహాలలోని బాలికలపై అత్యాచార ఆరోపణలన్నిటిమీద దర్యాప్తు బాధ్యతను సుప్రీంకోర్టు సీబీఐకి గత నవంబర్లో అప్పగించింది. దాంతో కేసు విచారణకు నియమించిన విచారణాధికారులెవ్వరినీ తన అనుమతి లేకుండా బదిలీ చేయరాదని అప్పుడే స్పష్టంగా చెప్పింది. అయినా ఖాతరు చేయకుండా విచారణ బందం చీఫ్ ఏకే శర్మను బదిలీ చేయడం పట్ల న్యాయస్థానం ఆగ్రహించింది. కేసు దర్యాప్తు చివరి దశలో ఉండగా పర్యవేక్షణ అధికారిని మార్చడంలో కుట్ర కోణం దాగి ఉందంటూ ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్పై మరోసారి కోర్టు విచారించింది. గతవారం విచారణకు వచ్చినప్పుడే నాగేశ్వరరావును మందలించింది. స్వయంగా సంతప్తి చెందకుండా ఎవరి ఆదేశాలకో లొంగిపోయి అఫిడవిట్ను దాఖలు చేయొద్దని ఆనాడే హెచ్చరించింది. ఒక సీబీఐ అధికారికి ఈ విధంగా ఉద్యోగ బాధ్యతలను స్పష్టంగా చెప్పవలసి రావడమే బాధాకరం. మిమ్మల్ని దేవుడే కాపాడాలంటూ హెచ్చరించడమంటే ఇంతకంటే అవమానం ఏముంటుంది?. సీబీఐ మీద నమ్మకం పూర్తిగా చెదిరిపోవడంతో ముజఫర్పుర్ కేసు విచారణ బాధ్యతను బీహార్నుంచి ఢిల్లీ సాకేత్లోని పోక్సో చట్టం ట్రయల్ కోర్టుకు సుప్రీం ధర్మాసనం బదిలీ చేసింది. మిగిలిన 16 గహాల కేసులో ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా సహించేది లేదని బీహార్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
పాలకుల తప్పుడు సలహాలను, ఆదేశాలను గుడ్డిగా పాటించి చట్టాలకు వాటి స్ఫూర్తికి అధికారులు తూట్లు పొడవడం ఎంతటి ఘోరమైన నేరమో సుప్రీంకోర్టు మాటల్లో బోధపడుతున్నది. ఇది ఇటువంటి అధికారులకో హెచ్చరిక. ఈ కేసులో నాగేశ్వరరావు కేవలం కీలుబొమ్మ మాత్రమే. దేశంలో కీలకమైన దర్యాప్తు వ్యవస్థలు పాలకుల చెప్పుచేతల్లోకి వెళ్లిపోడంకంటే ప్రమాదకరమైన పరిణామం ఏముంటుంది? ఇప్పటికైనా ఉన్నతాధికారులు రాజకీయ నేతలకు లొంగిపోకుండా రాజ్యాంగ సంస్థలను, స్వతంత్ర సంస్థలను రక్షించాలి.