Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా 2003లో ఇరాక్ను దురాక్రమించిన తరువాత మధ్య ప్రా చ్ఛంలో యుద్ధ ప్రమాదం నేడున్నంతగా ఎన్నడూ లేదు. ఇరా న్పై దాడి కోసం లక్షాఇరవై వేలమంది సైన్యాన్ని దించటానికి అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చ టమే లక్ష్యంగా అమెరికా యుద్ధ ప్రణాళిక ఉంది. కొందరు జాతీయ భద్రతాధికారులకు ఈ విషయంపై నిర్దేశాలను జారీచేసినట్టు మంగళ వారంనాడు న్యూయార్స్ టైమ్స్ రా సింది. కానీ ఈ వార్త 'ఫేక్ న్యూస్' అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అ భివర్ణించాడు. అయితే టైమ్స్ రాసి నదానికంటే ఎన్నో రెట్ల సైన్యాన్ని దించటానికి అమెరికా సర్వసన్న ద్ధంగా ఉందని ఆయన అన్నాడు.
ఈ సైన్య సమీకరణ జరగకముందే ఇరాన్పై అనేక రకాల బెదిరింపు చర్యలకు అమెరికా పాల్పడింది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే యుద్ధ నౌక నేతృత్వంలో ఒక యుద్ధ నౌకల గ్రూపును ఇరాన్ సమీపంలో అమెరికా మోహరించింది. ఈ గ్రూపులో అణ్వస్త్రాలను ఉపయోగించగల బి-52 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ గ్రూపుతోపాటుగా ఉభయచర యుద్ధ నౌక యుఎస్ఎస్ అర్లింగ్టన్ను కూడా అమెరికా మోహరించింది. ఈ నౌకలో నౌకాదళమే కాకుండా యుద్ధ విమానాలు, ప్యాట్రియాట్ క్షిపణి వ్యవస్థ ఉంటాయి. దశాబ్దాల తరబడి అమెరికా దురాక్రమణలకు ఈ ప్రాం తం ఆలవాలంగా మారింది. పర్షియన్ గల్ఫ్ దక్షిణ తీరాన్ని తన వాయు, నౌకాదళ స్థావరంగా అమెరికా మార్చింది. తత్ఫలితంగా ఈ ప్రాంతంలో ఏ చిన్న ప్రకోపం జరిగినా యుద్ధ జ్వాల రగిలే ప్రమాదం ఉంది. మరోవైపు అమెరికా సైనిక వర్గాలు ఇప్పటికే కార్పొరేట్ మీడియాను సన్నద్ధం చేస్తున్నా యి. ఇరాక్ యుద్ధ సమయంలో అమెరికా కార్పొరేట్ మీడి యా యుద్ధ ప్రచార సాధనంగా పనిచేసిన విషయాన్ని యావత్ ప్రపంచం వీక్షించింది. యునైటెడ్ అరబ్ ఎమి రేట్స్ తీరజలాలలో నాలుగు నౌకల పై, ముఖ్యంగా రెండు సౌదీ చమురు నౌకలపై జరిగిన దాడిని 'ఇరాన్ అనుకూల శక్తుల' పనిగా అమెరికా కార్పొరేట్ మీడియా ప్రచారం చే స్తున్నది. అయితే ఇందుకు సంబంధి ంచి సాక్ష్యాధారాలను బయటపెట్టవలసిన అవసరం లేదన్నట్టుగా కార్పొరేట్ మీడియా ప్రచారం సాగుతోంది.
సౌదీ రాచరికపు జాతీయ చమురు కంపెనీ సౌదీ ఆరాంకో యాజ మాన్యంలో ఎర్ర సముద్రంలోగల రెండు పంపింగ్ స్టేషన్లపై దాడులు జరిగాయి. యెమెన్ దేశానికి చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఆ దాడులు చేసింది తామే అని ప్రకటించారు. యెమెన్పై అమెరికా దన్నుతో సౌదీ అరేబియా చేస్తున్న మానవ హనన యుద్ధంలో ఇప్పటికే ఎనబై వేలమంది చనిపోయారు. కోటిమందికి పైగా ప్రజలు కృత్రి మంగా సృష్టించిన తీవ్రమైన కరువు ఎదుర్కొంటున్నారు. యెమెన్ ప్రజ లను భీతావహుల్ని చేయటానికి పాఠశాల మీద, వైద్యశాలల మీద, మసీదు ల మీద, ఆవాసాల మీద సౌదీ రాచరిక పాలన నిత్యం బాంబుల వర్షం కురిపిస్తుండగా హౌతీ ప్రతి ఘటనను 'టెర్రరిజం'గా అభివర్ణించటం నిజం గా విడ్డూరం. హౌతీ ప్రతి ఘటనను ఇరాన్ దాడిగా చిత్రించి ఇరాన్పై దాడిచేయటానికి అమెరికా ప్రయ త్నిస్తున్నది. అమెరికా విదే శాంగ కార్యదర్శి మైక్ పోం పియో, జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఇరాన్కు చేస్తున్న హెచ్చరికలు దీనినే సూచిస్తున్నా యి. ఇరాన్ను ఆర్థిక దిగ్బంధనం చేయటంద్వారా ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచిన తరువాతే ఆ దేశంపై అమెరికా దాడి చేస్తుంది. దీనినే అమెరికన్లు 'గరిష్ట వత్తిడి' విధానం అని పిలుస్తున్నారు. ఇలా ఇరాన్ను ఆర్థికంగా ఉరివేయాలని అమెరికా చూస్తున్నది.
2015లో అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్లతో ఇరాన్ చేసుకున్న అణ్వ స్త్ర ఒప్పందం నుంచి ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా అమెరికా వైదొలగింది. ఆ తరువాత ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని అమెరికా చూస్తోంది. ఈ ఆంక్షల కారణ ంగా ఇప్పటికే ఇరాన్లో ద్రవ్యోల్బణం 50శాతం పెరిగింది. దారిద్య్రం, నిరు ద్యోగం పెరిగాయి. అణ్వస్త్ర ఒప్పందంలోని షరతులన్నింటినీ తూచా తప్ప కుండా అమలుచేసినప్పటికీ అణ్వస్త్రాలను తయారుచేసే కార్యక్ర మంలో ఇరాన్ ఉందని అమెరికా ఆరోపిస్తోంది. ఇరాక్ మానవ హనన ఆయుధాలను కలిగి ఉన్నదని ఆరోపించి, అది సాకుగా తీసుకుని ఆ దేశంపై కిరాతకంగా అమెరికా దాడి చేసిన విధంగా నే ఇరాన్పై కూడా దాడి చేయాలనేది అమెరికా వ్యూహం.
ఇరాన్ ఇరాక్ కంటే నాలుగు రెట్లు పెద్దది, రెండు రెట్ల కంటే ఎక్కువ జనాభా ఉంది. ఈ దేశంపై అమెరికా దాడిచేస్తే పరిణా మాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 16 ఏండ్ల క్రితం ఇరాక్పై అమెరికా దాడి చేసినప్పుడు 10లక్షలమంది చనిపోయారు. అనేక లక్షలమంది గాయపడ్డారు. అలాగే 4500మంది అమెరికా సైని కులు యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయారు. 30,000మంది కంటే ఎక్కువగా క్షతగాత్రులయ్యారు. అంటే అమెరికా ఇరాన్పై చేయబోయే యుద్ధంలో అనేక లక్షలమంది ప్రజల ప్రాణాలు పోవటమే కాకుండా, చైనాతో వాణిజ్య యుద్ధానికి తెరలేపిన సందర్భంగా ఈ యుద్ధం మరింతగా విస్తృతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికా సామ్రాజ్యవాద దుందుడుకుతనాన్ని ప్రపంచ ప్రజాస్వామిక శక్తులు అడ్డుకోవాలి. అందుకోసం మరోసారి ప్రపంచ శాంతి కోసం ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉంది.