Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీలో ప్రారంభమైన మత మారణ హౌమం, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి సింహాసనం సంపాదన, అన్నిటికి మించి రాజ్యసభలో మెజారిటీ సంపాదించడం కోసం జరిగిన కుస్తీ... ఇన్ని ప్రాధాన్యతల మధ్య మోడీ అండ్ కంపెనీకి కోవిడ్-19 గురించి ఆలోచించే తీరికేది? ప్రజల గురించి, ప్రజారోగ్యం గురించి పట్టించుకునే ఓపికేది? మోడీగారి నిఘంటువులో ''ప్రజలు'' లేరు. కోవిడ్ వచ్చినా, ప్రళయం వచ్చినా పైన చెప్పిన ''స్వ''ంత మనుషులకే ప్రాధాన్యత.
బలి అనేది ఒక క్రియమాత్రమే. దానికి అటువైపు ఒక కర్త ఉండాలి. ఇటువైపు ఒక కర్మ ఉండాలి. గుజరాత్ బలైందంటున్నాం కాబట్టి కర్మ స్పష్టమే. ఇక ఈ సందర్భంలో కర్త ఎవరనేది జర్ర సంక్లిష్టం. ట్రంప్ వల్ల మోడీయా? మోడీ వల్ల ట్రంపా? ఇద్దరూనేమో అనిపించినా, ఒక క్రియకు ఇద్దరు కర్తలుండే ఛాన్స్ తక్కువే! మరి రామాయణంలో రావణాసురుడి ముగింపునకు వారధికట్టిన కోతుల మొదలు రావణాసురుడి కడుపులో బాణం దింపిన రాముడి వరకు ఎందరో కర్తలున్నారు కదా అనే వాదన ఉందనుకోండి. నేటి గుజరాత్ విషాదానికి ఎంతో కాలం నుంచి పోగుపడ్డ ఎందరో కర్తల క్రియలున్నాయి.
2014- ఎన్నికల ముందు దేశంలో మార్మోగిన అంశం ''గుజరాత్ అభివృద్ధి'' ''సదరు గుజరాత్ మోడల్కు కారణం మోడీ'' ''ఆయనే గనుక దేశ ప్రధాని అయితే, ఓV్ా! దేశంలో వెలుగులు నిండిపోవా?'' మధ్య తరగతికి, శిగమొచ్చేలా చేసిన అంశాలివి! మానవాభివృద్ధి సూచీలో గుజరాత్ ఏనాడూ ముందు లేదు. నేటి కరోనా సంక్షోభం గుజరాత్ డొల్ల తనాన్ని బయటపెట్టింది.
ఎందుకంటే గుజరాత్లో వెయ్యిమందికి 0.33 ఆస్పత్రి పడకలున్నాయి. ఇది దేశ సగటు 0.55 కంటె తక్కువ. ఇంతకంటే అధ్వాన్నంగా ఉండే పెద్ద రాష్ట్రం బీహార్ మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యంపై పెట్టే ఖర్చులో గుజరాత్ 1999-2000లో 4వ స్థానం నుంచి 2009-10 (అంటే దాదాపు పదేండ్ల మోడీ నిర్వాకం తర్వాత) 11వ స్థానానికి దిగజారింది. నికర స్థూల రాష్ట్ర ఆదాయంలో ప్రజారోగ్యంపై ఆ రాష్ట్రం పెట్టిన ఖర్చు గత దశాబ్ద కాలంలో 0.87శాతం నుంచి 0.73శాతానికి పడిపోయింది. పుట్టగానే మరణించే పసికందులు ఈ రాష్ట్రంలో చాల ఎక్కువ. గుజరాత్లోని పీహెచ్సీలు బీహార్ కంటే తక్కువ. అనేక ప్రభుత్వ ఆస్పత్రులను ప్రయివేటువారికి అప్పగించారు.
ఈ పరిస్థితిలో, ఇంత అధ్వాన్న పాలకులున్న రాష్ట్రాన్ని కోవిడ్-19 చుట్టుముట్టింది. దేశంలో అత్యధిక కోవిడ్ మరణాలున్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. అహ్మదాబాద్లోని అతి పెద్ద సివిల్ దవాఖన ఆ రాష్ట్రంలో సంభవించిన మరణాల్లో 45శాతం మూటగట్టుకుంది. ''అది అసలు ఆస్పత్రా ఖైదీలనుంచే నేలమాళిగనా?'' అని ఆ రాష్ట్ర హైకోర్టు మొట్టికాయలు వేసింది. నలుగురు ఐఎఎస్ అధికారులను బాధ్యులను చేసింది. ''వెంటిలేటర్లు లేక ఈ ఆస్పత్రిలో రోగులు చనిపోతున్నారనే విషయం అసలీ ప్రభుత్వానికి తెలుసా?'' అని ప్రశ్నించింది ఆ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్.
ఇంత దౌర్భాగ్య పాలనున్న రాష్ట్రం కోవిడ్ దెబ్బకి విలవిలలాడటంలో ఆశ్చర్యమేముంది? ఇక్కడే ట్రంప్ మహాశయుడు సీన్లోకొచ్చాడు. మోడీసాబ్ రంగంలో కొచ్చాడు. స్వామి కార్యంతో పాటు స్వకార్యం అంటే స్వంత మనుషుల కార్యం, అనగా ఇద్దరు అంబానీలు, ఒక అదానీ, ఒక నీరవ్మోడీ, ఆయన మేనమామ మేహుల్ చోక్సీ వగైరా వగైరాతో పాటు టాటా సన్స్, బిర్లా ఫ్యామిలీ - 'స్వ' అనే ఒక్క అక్షరంలో ఇంతమంది ఒదిగిపోయారు. వీరందరి బాగోగులు ఇంకోనాలుగేళ్ళు చూసుకోవాల్సింది మోడీసాబే కదా! అందుకే ట్రంప్ మోచేతి నీళ్ళు తాగైనా దివాళా ఎత్తిన అనిల్ అంబానీకి యుద్ధ విమానాల ఆర్డర్లు సంపాదించగలిగారు? టాటాకి అదిభట్ల ఎయిరోస్పేస్లో హెలికాప్టర్ల విడిభాగాలు, రిలయెన్స్ బ్రదర్స్కి మన ప్రభుత్వరంగాన్ని మాడ్చి మిసైల్స్, ఫీల్డ్గన్స్ ఆర్డర్లు దొరుకుతాయి? ట్రంప్ మోచేతి నీళ్ళు తాగడమే కాదు, కండ్లకద్దుకొని నెత్తిన చల్లుకున్నందుకు 446లైసెన్స్లు డిఫెన్స్రంగంలో పైన పేర్కొన్న వారందరికీ దొరుకుతాయి? ఇక్కడే ఓట్లేసిన ప్రజలు. చివరికి స్వరాష్ట్ర ప్రజల్ని కూడ ఆయన మర్చిపోయేంత తన్మయత్వం పొందాడు. ''నమస్తే ట్రంప్'' కార్యక్రమం ఫిబ్రవరి 24న అహ్మదాబాద్లో జరిగింది. ఎందుకో తెలుసా? అమెరికాలో నివశించే బారతీయుల్లో అత్యధికులు చారిత్రకంగా డెమొక్రటిక్ పార్టీ ఓటర్లు. కాని ఇండియాలో మోడీ అభిమానులు. ఈ చారిత్రక వైరుధ్యాన్ని సరి చేసే మోడీ, ట్రంప్ల ప్రయత్నంలో మలిఘట్టం నమస్తే ట్రంప్.
జనవరి 30నే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కోవిడ్-19ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినా, ఈ వైరస్ దేశ, దేశాల్లోకి విమాన ప్రమాణీకుల ద్వారానే విస్తరిస్తోందని తెల్సినా మోడీ మాత్రం విమానాలు రద్దు చేయలేదు. విమాన ప్రయాణాలనూ ఆపలేదు. కోవిడ్ చాపకింద నీరులా విస్తరించింది. మోడీగారి ఎజెండా ఇంకా ఉంది. ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో సాగిన ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమాన్ని అణిచే ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. ట్రంప్ విమానంపైకి లేచిందే తడవుగా ఢిల్లీలో ప్రారంభమైన మత మారణ హౌమం, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి సింహాసనం సంపాదన, అన్నిటికి మించి రాజ్యసభలో మెజారిటీ సంపాదించడం కోసం జరిగిన కుస్తీ... ఇన్ని ప్రాధాన్యతల మధ్య మోడీ అండ్ కంపెనీకి కోవిడ్-19 గురించి ఆలోచించే తీరికేది? ప్రజల గురించి, ప్రజారోగ్యం గురించి పట్టించుకునే ఓపికేది? మోడీగారి నిఘంటువులో ''ప్రజలు'' లేరు. కోవిడ్ వచ్చినా, ప్రళయం వచ్చినా పైన చెప్పిన ''స్వ''త మనుషులకే ప్రాధాన్యత.