Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక వైపు నానాటికీ తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం, మరో వైపు విజంభిస్తున్న కోవిడ్-19, ఈ రెంటినీ ప్రపంచమంతా ఏకమై ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కరోనా వైరస్కు ఎల్లలూ, సరిహద్దులూ లేవు. ఈ పరిస్థితిలో ఇరుగు పొరుగు దేశాల నడుమ సామరస్యం, శాంతి, సదవగాహన, సహకారం, పెరిగే విధంగా వ్యవహరించాల్సి ఉంది. అంతకన్నా దేశభక్తి మరేమీ లేదు.
భారత, చైనా దేశాలు సర్వసత్తాక రాజ్యాలుగా ఏర్పడిన తొలి దశకంలో 'హిందీ-చీనీ భాయి భాయి' నినాదం రెండు దేశాల్లోనూ మారు మోగింది. కానీ ఆ తర్వాత రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం తలెత్తి 1962లో యుద్ధానికే దారి తీసింది. అప్పటి నుంచీ దేశంలో చైనా వ్యతిరేకత పెద్ద ఎత్తున చెలరేగింది. అయితే ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం పరస్పరం విశ్వాసంతో, సామరస్య పూర్వక వాతావరణంలో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో పరిష్కారం కావాలని సీపీఐ(ఎం) ఆనాడే చెప్పింది. అదే విషయాన్ని ఆ తర్వాత కాలంలో ఇరు ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న వాజ్పేరు చైనాతో వివాదానికి ద్వైపాక్షిక చర్చలే పరిష్కారమనడమే కాదు, అందుకు ముమ్మర ప్రయత్నాలూ చేశారు. ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు విస్తరించాయి. వ్యాపార లావాదేవీలు పెరిగాయి. పరస్పరం పెట్టుబడుల మార్పిడులు జరిగాయి. ఇన్నేండ్ల తర్వాత మళ్లీ ఉద్రిక్తతలు, ఘర్షణలు సంభవించి ఇరు వైపులా ప్రాణ నష్టం జరగడం బాధాకరం. అయితే వెనువెంటనే ఇరు దేశాల ప్రతినిధులూ ఉద్రిక్తతలు తగ్గించే దిశగా చర్చలు, చర్యలు ప్రారంభించడం సానుకూల పరిణామం.
ఈ తరుణంలో చైనా వస్తువులను నిషేధించాలన్న ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగిస్తున్నారు బీజేపీ మంత్రులు. దేశభక్తి ప్రదర్శించడమంటే చైనా వస్తువులను తగలబెట్టడమే అనేంతగా ఇది జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహమే అన్నట్టు దాడి చేస్తున్నారు. భారత దేశ పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవడం సర్వత్రా అఖిలషనీయం. కానీ మనం 20వ శతాబ్ద ప్రారంభ దినాల్లో లేమని అందరూ గుర్తించాలి. ప్రపంచీకరణ శకంలో మూడు దశాబ్దాలు ప్రయాణించాం. మనమేకాదు, ఈ ప్రపంచమే సాగిపోతోంది. చైనా నుంచి మన దేశంలోకి దిగుమతులు 7500 కోట్ల డాలర్లు. విద్యుత్ తయారీ యంత్రాలు, టెలికం ఎక్విప్మెంట్, ఫార్మారంగం, కెమికల్స్, పెట్రోకెమికల్స్ వంటివాటిలో వినియోగించే ఇంటర్ మీడియరీలు కీలకం. ఈ ఇంటర్ మీడియట్ సరుకుల్ని వినియోగించుకునే మన దేశీయ పరిశ్రమలు హఠాత్తుగా ఆ దిగుమతులు లేకపోతే మూతపడతాయి. ఇది మరో ప్రమాదకర పరిణామానికి దారితీయవచ్చు.
బ్రెట్టన్ వుడ్స్ కవలలు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు విధానాలను మనదేశంలో కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఆమోదించినవే. అమలు చేసినవే. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) షరతులు ఉనికిలోకి రావడానికి రెండేండ్ల ముందే 2003లో క్లింటన్ వచ్చినప్పుడు 1429 రకాల అమెరికన్ సరుకులు ముందస్తుగానే తలుపులు బార్లా తెరిచింది వాజ్పారు సర్కారే. డబ్ల్యూటీఓని ఆమోదించిన తర్వాత దానివల్ల వచ్చే ఫలితాలన్నింటిని ఆమోదించినట్టే కదా! దాన్లో భాగమే ఇది. మొత్తం ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రేవేటీకరణ విధానాల్ని మోడీ సర్కార్ వ్యతిరేకిస్తే దానికి నిజాయితీ ఉన్నట్టు. ఆ పని చేయకుండా ఒక దేశ సరుకులు మాత్రమే ఆపగలగడం సాధ్యమేనా?
మనదేశం తన కాళ్ళపై తాను నిలబడాలనుకోవడం స్వావలంబన. రక్షణ ఉత్పత్తుల రంగంతో సహా అమెరికన్ కంపెనీలకు తలుపులు తెరిచి నిర్భర భారత్ అంటే దేశభక్తా? అమెరికా దేశభక్తా? ఇది స్వావలంబన కాదు. అమెరికాలంబన కోసం మోడీ సర్కార్ కుస్తీ.
అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అంతకంతకూ విశృంఖలం అయ్యాక బహుళజాతి సంస్థల కన్సార్షియాలు నెలకొల్పబడుతున్న వేళ ఏ దేశ పెట్టుబడి ఏదో గిరిగీసి నిర్ధారించే పరిస్థితి లేదు. ప్రపంచ పెట్టుబడిని చేతులు జోడించి ఆహ్వానిస్తూ ఆ వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేదన్నంతగా అంగీకరిస్తూ, అది చెప్పినట్టు ప్రభుత్వాల విధానాలను రూపొందిస్తూ ఉంటే, ఇప్పుడు కలగూరగంప వంటి ఫైనాన్స్ కేపిటల్లో నుంచి చైనా పెట్టుబడులను మాత్రం వేరు చేసి తిరస్కరించాలి అనడం ఆచరణ సాధ్యమా? ఒక వస్తువు కానీ, యంత్రంకానీ, కార్లుకానీ, మొబైల్ ఫోన్ల్కానీ ఏదైనాసరే వాటిలోని విడి భాగాలు వేర్వేరు దేశాల్లో తయారవుతున్నాయి. అవన్నీ ఒక దగ్గరకు చేర్చి అసెంబుల్ అవుతున్నాయి. సింగిల్ బ్రాండ్, లేదా మల్టీ బ్రాండ్ కంపెనీల లోగోలతో మార్కెట్లోకి విడుదలవుతాయి. రిలయన్స్ కుదురులోని జియో కంపెనీలో వేర్వేరు దేశాల కంపెనీల పెట్టుబడులున్నాయి. అలాగే వేరే దేశాల్లోని కంపెనీల్లో మన కార్పొరేట్ల వాటాలున్నాయి. 'పెట్టుబడి'కి కావాల్సింది మార్కెట్. పోటీలో నిలవాలంటే కొత్త ఆవిష్కరణలతో కూడుకున్న చౌక వస్తువుల తయారీ అనివార్యం. దానిలో ఎవరు రాణిస్తే వారికే లాభాలు. వినియోగదారులకు కావాల్సిందీ నూతనత్వంతో కూడిన చౌక వస్తువులే. ఆచరణసాధ్యంకాని, ప్రయోజనం లేని 'బహిష్కరణ' నినాదంతో ప్రజల భావోద్వేగాలతో ఆటలాడుకోవడం మనకే నష్టం.
కరోనా ప్రభావ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రకటించిన 'ఆత్మ నిర్భర భారత్' ప్యాకేజీలో మన దేశాన్ని తన కాళ్లపై తాను నిలబడే విధంగా స్వావలంబనను పటిష్టం చేస్తామంది. ఇప్పుడే వ్యవసాయం, రక్షణ, పర్యాటకం, ఇంధనం, మౌలిక వసతుల కల్పనలో విచ్చలవిడిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆహ్వానించి ఆత్మనిర్భర భారత్లో 'ఆత్మ' లేకుండా చేసింది. దీనిని ప్రశ్నించకుండా స్వాగతించిన వారు నేడు చైనా విషయంలో స్వావలంబన గురించి మాట్లాడడం విడ్డూరం. ఒక వైపు నానాటికీ తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం, మరో వైపు విజంభిస్తున్న కోవిడ్-19, ఈ రెంటినీ ప్రపంచమంతా ఏకమై ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కరోనా వైరస్కు ఎల్లలూ, సరిహద్దులూ లేవు. ఈ పరిస్థితిలో ఇరుగు పొరుగు దేశాల నడుమ సామరస్యం, శాంతి, సదవగాహన, సహకారం, పెరిగే విధంగా వ్యవహరించాల్సి ఉంది. అంతకన్నా దేశభక్తి మరేమీ లేదు.