Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామ్రాజ్యవాద అమానవీయ సంస్కృతి సంగీతాన్ని సైతం కలుషితం చేస్తోంది. తమ అకత్యాలకు నేపథ్యగీతంగా మార్చుకుంటోంది. సామాజిక సృహను చిగురింపజేసే చైతన్యం, నెత్తురు మండే శక్తులు నిండే యువకుల ఉత్తేజం నేటి తరానికి అవసరం. హదయాలను ఉరకలెత్తించే శ్రమైకజీవన సౌందర్యం పురివిప్పాలి. సామాజిక సంగీతం కేవలం గత చరిత్ర కాదని, వర్తమానం, భవిష్యత్ కూడానని... సమైక్యగీతం ఆలపిద్దాం.
'శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణ్ణి' అన్నారు సంగీతజ్ఞులు. ఇలా ఆబాల గోపాలన్ని రంజింపచేయగలిగేది, ఆనందసాగరంలో ముంచెత్తేది సంగీతం. శ్రవణపేయంగా వినడానికి హాయిగా ఉండే శబ్దాల సమ్మేళనమే సంగీతం. 'గీతం వాద్యం తధా నత్యం త్రయం సంగీతముచ్యతే'- గీతము, వాద్యము, నత్యము... ఈ మూడింటి కలయికనూ, రాగము.. స్వరము... తాళము- ఈ మూడింటి మేళవింపునే సంగీతమంటారని 'సంగీత రత్నాకరం' చెబుతోంది. సంగీతం విశ్వజనీన మాధ్యమం. నీటి గలగలల ఉరవడిలో... గాలి గుసగుసల సవ్వడిలో... పక్షుల కిలకిలరావాల ధ్వనిలో సంగీతం జనిస్తుంది... ధ్వనిస్తుంది. అంతెందుకు అసలు ప్రకతే ఒక సంగీత ఝరి. 'నీ మందహాసం... మధుమాస పుష్పం/ నీ మధుర గాత్రం... సంగీత శాస్త్రం' అంటూ చెలి మందహాసాన్ని కూడా సంగీతంతో పోల్చుతాడో కవి. మనిషిని కదిలించి.. కరిగించి... పరవశింపజేసే మహత్తరశక్తి సంగీతానిది. ఆనందం.. ఆవేశం... వినోదం.. విషాదం- సందర్భం ఏదైనా.. దానికి గళమిచ్చేది, గమనమిచ్చేది సంగీతం. శ్రమ నుంచి పుట్టి, పనితో జతకూడి, లయతో ధ్వనిని చేర్చి, జన జీవనంతో మమేకమై, మదిని పులకరిస్తుంది... నరాల్లో నెత్తురును ఉరకలేయిస్తుంది. పాట లేని ప్రపంచాన్ని ఊహించలేం. ఆ పాటను రక్తికట్టించే ధ్వని రూపమే... సంగీతం. ఏ సంగీత వాయిద్యాలూ లేనప్పుడు కూడా ధ్వని ఉంది.. శబ్దం ఉంది. అది శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటి చెప్పింది. రాతియుగం నుంచి కంప్యూటర్ యుగం వరకు సంగీతం స్వేచ్ఛగా రాజ్యమేలుతున్నది. చంటి బిడ్డగా అమ్మ ఒడి నుండే సంగీతాన్ని ఆలకించడం, ఆస్వాదించడం మొదలు పెడతాడు మనిషి. అది లాలిపాటైనా, జానపదమైనా, శాస్త్రీయ సంగీతమైనా, చివరకు లల్లాయిపదాల కూర్పు అయినా ప్రజలను ఓలలాడించే శక్తి సంగీతానిది. శ్రమ నుంచి, కష్టం నుంచి, వేదన నుంచి పాట పుట్టింది. జీవితపు ప్రతి మలుపులోనూ పాట తన అస్థిత్వాన్ని చాటుతూనే ఉంది.
సంగీతం చాలా శక్తివంతమైనది. సంగీతానికి రాళ్లు పిండవుతాయి, కొండలు కరుగుతాయి అని చెబుతారు. సంగీత ప్రభావంలో హిందూస్తానీ వాగ్గేయకారులు తాన్సేన్ మేఘమాల లహరి రాగంలో వర్షాలు కూడా రప్పించాడని చెబుతారు. వాటి నిజానిజాల మాటెలావున్నా, జనాన్ని పోరాటాలు, ఉద్యమాల్లోకి కదిలించడంలో కీలక భూమిక పోషించింది సంగీతం అని అందరం ఒప్పుకుంటాం. 'స్వరాజ్యం నా జన్మ హక్కు' అని నినదించింది సంగీతం. భక్తి ఉద్యమంలో సైతం అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వారంతా 'దేవుడు అందరివాడే' నంటూ శక్తివంతంగా జనాన్ని కదిలించారు, ఛాందసవాదంపై తిరుగుబాటు చేశారు. ఫాసిస్ట్ వ్యతిరేక సంగీతానికి ఒక ఊపునిచ్చాడు అమెరికన్ సంగీతకారుడు పాల్ రాబ్సన్. ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా తన సంగీతాన్ని ఎరుపెక్కించాడాయన. అలాగే నియంతృత్వానికి వ్యతిరేకంగానూ గళం విప్పింది సంగీతం. సంగీతానికి ప్రాంతంలేదు, మతం లేదు, కులం లేదు, భాషలేదు. మనిషిని ఉరకలెత్తించే భావం చాలు... నేను సైతం అంటూ కదం తొక్కడానికి. సంగీతానికి ప్రజాతంత్ర స్వభావం ఉంది గనుకనే అది నియంతలను సవాలు చేస్తుంది. అందుకే వారు సంగీతకారుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తారు. అలా నిషేధాలను ఎదుర్కొన్న అనేక పాటలు మనకున్నాయి. 'మాకొద్దీ తెల్లదొరతనమూ' అంటూ గర్జించిన పాట సైతం నిషేధాన్ని ఎదుర్కొంది. చివరకు నిషేధించిన వాళ్లే దేశం వదిలి పోవాల్సి వచ్చింది తప్ప... తెలుగునాట ఆ పాట నేటికీ మారుమోగుతూనే ఉంది. కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొనే ఉత్సాహం, స్ఫూర్తిని నింపుతూ... 'చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా/ కాళ్లు కూడా మొక్కుతా.. అడుగు బయట పెట్టకురా' వంటి పాటలూ ఈ క్లిష్టసమయంలో జనాన్ని ఉత్తేజపరిచాయి.
సామాజిక అస్థిత్వం పాటతో ముడిపడి ఉంటుంది. ఆ పాట ఏ ఉద్యమానికైనా ఇంధనంలా మారుతుంది. ఇది వర్తమానంలోనూ ప్రభవించే గత చరిత్ర. పొలం పనుల నుంచి.. తరగతి గదుల వరకు, పల్లె జీవితాల నుంచి.. పట్నవాసం వరకు, అణిచివేత, వివక్షతల నుంచి పెల్లుబికిన ఆగ్రహంలోంచి పాట ప్రాణం పోసుకుంది. నెత్తురు ఉరకలెత్తించింది. కోట్లాది గుండెలను తట్టింది. శాస్త్రీయ సంగీతాన్ని సైతం మరపించి కోట్లాదిమంది ప్రజల్ని చైతన్యస్రవంతిగా మార్చింది. 'సంగీతం నా మాటలకు రెక్కలిస్తుంది/ నా ఆశయాలకు ఆయువు పోస్తుంది/ నా కన్నీళ్లకు కళ్లెం వేస్తుంది' అంటాడో కవి. సామ్రాజ్యవాద అమానవీయ సంస్కృతి సంగీతాన్ని సైతం కలుషితం చేస్తోంది. తమ అకత్యాలకు నేపథ్యగీతంగా మార్చుకుంటోంది. సామాజిక సృహను చిగురింపజేసే చైతన్యం, నెత్తురు మండే శక్తులు నిండే యువకుల ఉత్తేజం నేటి తరానికి అవసరం. హదయాలను ఉరకలెత్తించే శ్రమైకజీవన సౌందర్యం పురివిప్పాలి. సామాజిక సంగీతం కేవలం గత చరిత్ర కాదని, వర్తమానం, భవిష్యత్ కూడానని... సమైక్యగీతం ఆలపిద్దాం.