Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖ : హిందుస్థాన్ షిప్యార్డ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ క్రేన్ కూలి 10 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్రేన్ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా అది కుప్పకూలినట్లు సమాచారం. క్రేన్ కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో క్రేన్ వద్ద 20 మందికిపైగా ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ భారీ క్రేన్ను దశాబ్దం క్రితం హిందుస్థాన్ షిప్యార్డ్ కొనుగోలు చేసింది. దీని నిర్వహణను ఇటీవలే పొరుగు సేవల సిబ్బందికి అప్పగించారు.