Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో నిందితులకు ఊరట కలిగింది. ఈ కేసులో 12 మంది నిందితులకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొందినవారిలో దక్షిణ కొరియాకు చెందినవారు కూడా ఉన్నారు. ఈ కేసులో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ, డైరెక్టర్ లను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విశాఖ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ విషవాయువు లీకై 14 మంది మృత్యువాత పడడం తెలిసిందే. ఈ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు.