Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కోఠి కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రి ఈటెల ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడీ పై ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా విషయంలో మొదట్లో ఉన్న పరిస్థితి లేదన్న ఆయన కరోనా విషయంలో భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. మానవ సంబంధాలను కూడా కరోనా ధ్వంసం చేసిందని, ఫ్లూ లక్షణాలు ఉంటే ఆస్పత్రికి వెళ్ళండని అయన సూచించారు. ఆర్ఎంపీల వద్దకు కోవిడ్ లక్షణాలతో వచ్చేవాళ్లకు ట్రీట్మెంట్ చేయొద్దని అన్నారు. పిహెచ్సి స్థాయిలోనే కరోనా నిర్దారణ జరగాలని ఫ్లూ లక్షణాలను అశ్రద్ధ చేయొద్దని అన్నారు. ఊపిరితిత్తుల్లో గాలి అడకుండా చేయటం కరోనా లక్షణమని ఈటెల పేర్కొన్నారు. కరోనాకు తక్కువ ఖర్చుతోనే ట్రీట్మెంట్ అన్న ఆయన ప్రయివేట్ ఆస్పత్రుల మీద, వందల్లో వేలల్లో ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. కరోనా విషయంలో ప్రయివేట్ ఆస్పత్రులు మానవతా దృక్పథంతో ఉండాలని మొదట్లోనే కోరామని అన్నారు. మనిషి చనిపోతే కూడా డబ్బుల కోసం వేధించటం అత్యంత హీన మయిన చర్యని, ప్రయివేట్ ఆస్పత్రులు కళంకితంగా మారాయని అన్నారు. ఇది డబ్బులు సంపాదించే సందర్భము కాదన్న ఆయన మరో రెండు ఆస్పత్రుల పై చర్యలు తీసుకుంటామని అన్నారు. భయంతో కొందరు చనిపోతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి పోతే చస్తారు అనడం తప్పన్న ఆయన ప్రయివేట్ లో చనిపోయే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిస్తున్నారని అన్నారు.