Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ప్రతిరోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మంగళవారం కూడా 7,760 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మహారాష్ట్రలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,57,956కు చేరింది. అందులో 2,99,356 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 1,42,151 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. ఇక కరోనా మరణాలు కూడా మహారాష్ట్రలో క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం కూడా కొత్తగా 300 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 16,142కు చేరింది. అయితే, మంగళవారం కొత్తగా 7,760 కొత్త కేసులు నమోదైనప్పటికీ అంతకంటే ఎక్కువగానే 12,326 మంది రికవరీ అయినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.