Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో మొట్టమొదటిసారి సాయుధులైన మహిళా సైనికులను కేంద్రం మోహరించింది.అసోం రైఫిల్స్ విభాగంలో మొట్టమొదటిసారి మహిళలను సరిహద్దుల్లో మోహరించారు. పారామిలటరీ విభాగంలో మహిళలను మొదటిసారి నియమించారు. రైఫిళ్లు చేతబట్టిన అసోం రైఫిల్స్ మహిళా సైనికులు సరిహద్దుల్లో పహరా కాస్తుండటంతో స్థానిక ప్రజలు వారికి సంతోషంతో స్వాగతం పలికారు. ఎముకలు కొరికే చలిలో సాయుధ మహిళా సైనికులు అనుక్షణం అప్రమత్తంగా సరిహద్దుల్లో పహరా కాశారు.