Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవ్వనుంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోనుంది. కొత్త సచివాలయం భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించి గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్నారు. చెన్నైకి చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్–పొన్ని జంట రూపొందించిన సచివాలయం డిజైన్ను ఇప్పటికే సీఎం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ డిజైన్కు మెరుగులు దిద్ది తుదిరూపు ఇచ్చేందుకు గత రెండు వారాలుగా సీఎం కేసీఆర్ కసరత్తు నిర్వహించారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది డిజైన్ను ఆమోదించడంతో పాటు నిర్మాణ పనుల అంచనా వ్యయం, టెండర్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. రాష్ట్ర కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా అద్భుత రీతిలో సచివాలయం భవనాన్ని నిర్మించాలని సీఎం యోచిస్తున్నారు. సీఎం, మంత్రులు, శాఖల కార్యద ర్శులు అందరూ ఒకే గొడుగు కింద పని చేసేందుకు సకల సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్టప్ ఏరియాతో కొత్త సచివాలయ భవనాన్ని దాదాపు రూ.450 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించడానికి కేబినెట్ ఆమోదించే అవకాశాలున్నాయి. ఒక్కో ప్రభుత్వ శాఖకు చెందిన మంత్రి, కార్యదర్శి, ఇతర అధికారులు, సిబ్బంది అందరూ ఒకే దగ్గర ఉండేలా సచి వాలయం నిర్మాణం ఉండనుంది. సచివాలయం అణు వణువు వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించాలని, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేయడా నికి అవకాశం ఉండరాదని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు సచివాలయం డిజైన్కు తుదిరూపం ఇచ్చి కేబినెట్ ముందు ఉంచనున్నారు.