Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళనాడు: షార్జా నుంచి చెన్నై వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఐదుగురు ప్రయాణికుల నుంచి రూ.82.3లక్షల విలువైన 1.48 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి చెన్నై వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఖాజా మొహియుద్దీన్, ఎస్ పీర్ మొహియుద్దీన్లతోపాటు ఐదుగురి నుంచి 1.2 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం ప్యాకెట్లను చెప్పుల్లో పెట్టుకొని షార్జా నుంచి వచ్చారు. ఐదుగురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఖలీల్ అహ్మద్ తన అండర్ వేర్ లో 280 గ్రాముల బంగారాన్ని తీసుకువస్తుండగా పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.