Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. 1167 ప్రొబెషనరీ ఆఫీసర్లు / మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుండగా, ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 20-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏదైనా డిగ్రీ పూర్తీ చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 734, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ లో 83, యుకో బ్యాంక్ లో 350 ఖాళీలు ఉన్నాయి. అప్లై చేసుకునేందుకు https://www.ibps.in/ క్లిక్ చేయండి.