Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బులంద్ షహర్ : ఉత్తర్ ప్రదేశ్ రాష్ర్టం బులంద్ షహర్లోని సిక్రీ గ్రామంలో లైంగిక దాడికి ప్రతిఘటించడంతో మైనర్ బాలికను ఓ వ్యక్తి హత్య చేశాడు. వివరాలు.. సిక్రీ గ్రామానికి చెందిన 30 ఏండ్ల అశోక్ స్థానికంగా నివాసం ఉండే 8 ఏండ్ల బాలికను మంగళవారం రాత్రి మొక్కజొన్నలు ఇస్తానని పిలిచి ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. ఈ సమయంలో బాలిక పెద్దగా కేకలు వేయడంతో అతను కత్తితో బాలికను పొడిచి చంపాడు. అనంతరం మృతదేహాన్ని పొలాల్లో దాచిపెట్టి పరారయ్యాడు. మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అశోక్ను అరెస్టు చేసినట్లు ఎస్ఎస్పీ సంతోశ్కుమార్ తెలిపారు. నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు, కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్ను చుట్టుముట్టి ఆందోళన చేశారు. కఠిన శిక్ష అమలయ్యేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు.