Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ బ్యాట్స్మెన్ విభాగంలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ర్యాంకులో కొనసాగుతున్నారు. తాజా వన్డే ర్యాంకింగ్స్ను ఐసీసీ బుధవారం వెల్లడించింది. వన్డే బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ(871పాయింట్లు), రోహిత్(855), పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్(829)టాప్-3లో ఉన్నారు. కాగా తాజాగా ఇంగ్లండ్తో జరిగిన చివరి వన్డేలో శతకంతో అదరగొట్టిన ఐర్లాండ్ కెప్టెన్ అండ్రూ బాల్బ్రెయిన్ 42వ ర్యాంకుకు చేరాడు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత స్పీడ్స్టర్ జస్ర్పీత్ బుమ్రా(719పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(722) టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ ముజీబుల్ రహ్మాన్(701) మూడో ర్యాంకులో ఉన్నాడు. ఐర్లాండ్తో సిరీస్లో రాణించిన ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నాలుగు స్థానాలను మెరుగుపరుచుకొని 25వ ర్యాంకుకు చేరాడు. కాగా ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ సూపర్ లీగ్లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన తొలి సిరీస్ను 2-1తో గెలిచిన ఇంగ్లండ్ 20పాయింట్లతో ఖాతా తెరిచిన సంగతి తెలిసిందే.