Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: లైంగిక దాడి కేసులో నిందితుడు గట్టు రాజేందర్కు నాంపల్లి కోర్టు పదేళ్ల శిక్ష విధించింది. అలాగే లక్ష రూపాయల జరిమానా విధిస్తూ బుధవారం ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. సికింద్రాబాద్ న్యూ బోయిన్పల్లికి చెందిన వాస్తు నిపుణుడు, సివిల్ కాంట్రాక్టర్ గట్టు రాజేందర్ 2012లో మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు న్యాయస్థానంలో ఛార్జ్షీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం నాంపల్లి కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది.