Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరోనా కు మందు ఉంది అంటూ ప్రచారం చేసుకున్న హోమియోపతి ఆసుపత్రిలో ఆ జిల్లా వైద్యాధికారులు తనిఖీ చేసారు. తన దగ్గర కరోనాకు మందు ఉంది అంటూ సోషల్ మీడియాలో హడాహుడి చేసిన హన్మకొండ హోమియో వైద్యుడి ఆస్పత్రిలో వరంగల్ అర్భన్ కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్యాధికారులు తనిఖీలు చేశారు. కోవిడ్ నిబందనల్ని పాటించకుండా వ్యవహరించిన తీరు పై ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆయుష్ నుండి పూర్తి స్థాయిలో నిర్ధారణ కాకుండానే కరోనా మందులు అంటూ మందులను అమ్మినందుకుగాను జిల్లా కలెక్టర్ సూచనతో రెవెన్యూ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి జిల్లా వైద్యాధికారులు ఆ ఆస్పత్రిని సీజ్ చేశారు.