Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : కోవిడ్ ఉ19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరపున కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్కు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అందజేశారు. ఎమ్మెల్యే వెంట అన్నె చిట్టిబాబు, రాజులపాటి రామచంద్రరావు, దోనేపూడి కిరణ్, హనుమంతరావు ఉన్నారు.