Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: ఉత్తరప్రదేశ్లో బీజేపీ కీలక నేతపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బాగ్పట్ జిల్లా మాజీ అధ్యక్షుడు సంజయ్ ఖోఖర్ను ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపేశారు. మంగళవారం ఉదయం సంజయ్ ఖోఖర్ పొలానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బీజేపీ నేత సంజయ్ ఖోఖర్ ఒంటరిగా నడుచుకుంటూ పొలానికి వెళ్తుండగా అప్పటికే అక్కడ మాటువేసిన దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. మృతుడి శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకెళ్లాయి. కాగా, పాతకక్ష్యలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతకుముందు బాగ్పట్లో ఇదే తరహాలో ఆర్ఎల్డి సీనియర్ నాయకుడు డెస్ఫాల్ ఖోఖర్ హత్యకు గురయ్యారు.