Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పితోర్ఘర్ జిల్లా ధర్చులాలోని కైలాష్-మనససరోవర్ యాత్ర మార్గంలో రెండుచోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. భాగేశ్వర్ సమీపంలో జాతీయ రహదారి 309 ఏపై భారీగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ ప్రాంతంలో చాలా ఇండ్లు ప్రమాదపు అంచున ఉన్నాయి. డెహ్రాడూన్ జిల్లాలో కుండపోత వర్షానికి థంస్సా నది ఉగ్రరూపం దాల్చి వరద తపకేశ్వరస్వామి ఆలయాన్ని తాకింది. రుద్రప్రయాగ్ జిల్లాలోని సిర్వాడి గ్రామంలో చాలా ఇండ్లు, రోడ్లు వరదలో కొట్టుకుపోయాయి. పితోర్ఘర్ జిల్లాలో ప్రకృతి విపత్తు కారణంగా దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ పర్యటించారు. కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు.