Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్ : రాజస్థాన్లో మంగళవారం ఉదయం 10.30గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 620 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 54,290కి చేరింది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో సోమవారం పది మృతి చెందగా.. మృతుల సంఖ్య 810కి చేరింది. ప్రస్తుతం 14,207 క్రియాశీల కేసులుండగా, మొత్తం 39,273 కోలుకున్నారని తెలిపింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 53,601 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో 24 గంటల్లోనే 871 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 22,68,676కు చేరుకున్నది. దీంట్లో 6,39,929 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 15,83,490 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది.