Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కృష్ణా: జిల్లాలోని తిరువూరులో నడిరోడ్డుపైనే ఓ నిండు గర్భిణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తిరువూరు పట్టణంలో 17వ వార్డుకు చెందిన నిండు గర్భిణికి నెలలు నిండటంతో ఆస్పత్రికి వెళ్లేందుకు బయలు దేరారు. 108 అంబులెన్స్ కోసం రోడ్డుపైకి వచ్చారు. అయితే 108 వచ్చే లోపే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో రోడ్డుపైనే ఆమె ప్రసవించింది. స్థానికుల సమాచారం మేరకు ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు సకాలంలో వచ్చి దగ్గరుండి ఆమెకు పురుడు పోశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు.