Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోపాల్ : లాకప్లో పోలీసులు తనపై పది రోజులు లైంగికదాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మహిళ ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని రేవా జిల్లాలోని జైలులో ఉన్నారు. హత్య కేసుకు సంబంధించి తనను ఈ ఏడాది మేలో అరెస్టు చేసిన పోలీసులు అదే నెల 10వ తేదీ నుంచి 21 వరకూ తమ కస్టడీలో ఉంచుకొని లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. తనకు రక్షణగా ఉన్న మహిళా కానిస్టేబుల్ను ఈ విషయం ఎవరికీ చెప్పొదంటూ వాళ్లు బెదిరించారని మహిళ వివరించారు. ఈ విషయాన్ని తనిఖీల్లో భాగంగా ఇటీవల జైలుకు వెళ్లిన న్యాయమూర్తికి, ఇతర న్యాయ విభాగ అధికారులకు బాధితురాలు వివరించారు. తనపై లైంగిక దాడి జరిగినట్లు మహిళ మూడు నెలల కిందటే చెప్పినట్లు జైలు అధికారి కూడా న్యాయ విభాగ అధికారులతో చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనపై దర్యాప్తు చేయాలని న్యాయమూర్తి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసులు మాత్రం తాము మహిళను మే 21వ తేదీన అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.