Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణకు గడవు ముగియడంతో ఫైనల్గా బరిలో నిలిచేదెవరో తేలిపోయింది. మరోవైపు, క్యాంపెయింగ్లో కాక పుట్టిస్తున్న పాలక ప్రతిపక్షాలు.. మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. దుబ్బాకలో ఇప్పటివరకూ మొత్తం 46 మంది నామినేషన్లు వేయగా.. అందులో 12 నామినేషన్లు సరిగా లేకపోవడంతో అధికారులు తిరస్కరించారు. దీంతో 34 మంది అభ్యర్థులు ఇప్పటి వరకు లెక్కతేలారు. అయితే అందులో మరో 11 మంది నామినేషన్ లు ఉపసంహరించుకోవడంతో మొత్తం 23 మంది బరిలో తేలారు. ఇక, ఇప్పటికే ప్రచారంలో నువ్వా?నేనా? అన్నట్టుగా పోటీపడుతున్నారు పాలక, ప్రతిపక్షాలు. మొత్తంగా, పార్టీలన్నీ ఓటర్లను కాకా పట్టడంలో బిజీ అయ్యాయి. కాగా, నవంబర్ 3న, దుబ్బాకలో పోలింగ్ జరగనుండగా.. 10న ఫలితం వెల్లడికానుంది.