Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఏపీలో కొత్తగా మరో 2,918 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. 24 మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,86,050కు చేరింది. ప్రస్తుతం 35,065 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా కారణంగా 6,453 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61,330 శాంపిళ్లను పరిశీలించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో నలుగురేసి చొప్పున మరణించారు. కడపలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 4,303 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 71,27,533 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.