Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ నుంచి అంబులెన్స్లో గంజాయి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. అంబులెన్స్లో నకిలీ పేషెంట్తో పాటు గంజాయిను తరలిస్తున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు వారి నుంచి రూ.కోటి 8 లక్షల విలువైన 181 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పదేళ్లుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.