Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అపోలో ఆస్పత్రిలో మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ పరామర్శించారు. నాయిని ఆరోగ్య పరిస్థితిని మంత్రి కేటీఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు కేటీఆర్ ఆదేశించారు. ఇటీవల ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా నాయినిని పరామర్శించారు. త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐసీయూలో నాయిని చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.