Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనత అందుకున్నాడు. ఐపీఎల్లో 200 మ్యాచ్లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ ద్వారా ధోనీ ఈ మైలురాయి చేరుకున్నాడు. చెన్నై ఫ్రాంఛైజీ తరఫున 170 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించిన మహీ పుణె(2016,2017సీజన్లలో) తరఫున 30 మ్యాచ్లు ఆడాడు. 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ధోనీ చెన్నై కెప్టెన్గా కొనసాగుతున్నాడు. చెన్నై ప్రాంఛైజీపై రెండేళ్లు నిషేధం విధించడంతో అతడు రైజింగ్ పుణె సూపర్ జైయింట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.