Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారీ వర్షాల ధాటికి రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 మంది చనిపోయారని మంత్రి కేటీఆర్ వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 33 మంది మరణించారని ప్రకటించారు. ఇప్పటి వరకు 29 మందికి రూ. 5 లక్షల చొప్పున సాయం అందించామని తెలిపారు. గల్లంతు అయిన మరో ముగ్గురిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వరద బాధితులు, మరణాలపై ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉందని వివరించారు.
వర్షం కారణంగా తలెత్తే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు 80మంది సీనియర్ అధికారులను వరద సహాయక చర్యల్లో పాల్గొంటారని, వీరంతా ఇదే పనిలో 15 రోజులపాటు ప్రాణనష్టం జరగకుండా చూస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.