Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డబ్బు కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడు అనే విషయం మరోసారి రుజువైంది. 50 రూపాయల కోసం జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో.. సంగం పాల డెయిరీలో రూ.50 అప్పు విషయంలో యువకుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో డెయిరీలో గమస్తాగా పనిచేస్తున్న బాజి అనే యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. పిడిగుద్దులకు రోడ్డుపై బాజి కుప్పకూలి పడిపోయాడు. అనంతరం స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో యువకుడి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.