Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు- ఖమ్మం రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కిరణ్ కుమార్ అనే డెంటిస్ట్(37) మృతి చెందాడు. రాగబోయిన గూడెం నుంచి ఇల్లందు వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న కిరణ్ కుమార్ను పాల్వంచ నుంచి ఖమ్మం వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కిరణ్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావటంతో అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనాకు ముందు కిరణ్ దంతవైద్యుడిగా పట్టణంలో వైద్యశాల నిర్వహించేవాడు. కొవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు లేక తాళ్లగూడెంలో భవన రంగం నిర్మాణ పనికి వెళ్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.