Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రోజురోజుకు పెట్రోల్ బంకుల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న పెట్రో ధరలతో సామాన్యుడిపై భారంతో పడుతుంటే.. బంకుల్లో జరుగుతున్న మోసాలతో వాహనదారులు మరింత నష్టపోతున్నారు. తాజాగా గజ్వేల్-ప్రజ్ఞపూర్ వద్ద ఉన్న ఓ బంకులో.. వాహనదారుడు తన బైకులో పెట్రోల్ కొట్టించుకున్నాడు. అనంతరం పెట్రోల్ లో నీళ్లు కలిసి ఉన్నాయని తెలుసుకుని అతడు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.