Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్కు బాంబే హైకోర్టు షాకిచ్చింది. అనధికారికంగా భవనాలు నిర్మించారనే ఆరోపణతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఇచ్చిన నోటీసులపై సోనూసూద్ వేసిన పిటిషన్ను బాంబే కోర్టు నేడు కొట్టి వేసింది. ముంబైలోని జుహూలో ఉన్న ఆరంతస్తుల భవనాన్ని ఎలాంటి అనుమతులూ లేకుండానే హోటల్గా మార్చారంటూ బీఎంసీ గత ఏడాది అక్టోబరులో సోనూసూద్కు నోటీసులు పంపింది. ఆ నోటీసులను సవాలు చేస్తూ సోనూ ఇటీవల బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తి.. బీఎంసీ నుంచి నోటీసులు వచ్చిన సమయంలోనే స్పందించాల్సిందని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇప్పుడు తమ చేతుల్లో ఏమీ లేదని పేర్కొంటూ సోనూ పిటిషన్ను కొట్టి వేశారు. దీంతో సోనూ సూద్ కు మళ్లీ నిరాశే మిగిలింది.