Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇరాక్ లో ఆత్మాహుతి దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఏడుగురు మరణించగా సుమారు 30 మంది వరకు గాయపడ్డారు. వివరాల ప్రకారం.. ఇకార్ రాజధాని బాగ్దాద్లోని తాయరన్ స్క్వేర్లో రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద ఈరోజు ఇద్దరు వ్యక్తులు తమను తాము బాంబులతో పేల్చుకున్నాడు. దాడుల్లో ఏడుగురు మరణించగా 30 మంది వరకు గాయపడినట్లు సమాచారం. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని, దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.