Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదారబాద్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేతలపై మంత్రి కేటీఆర్ సీరియన్ అయ్యారు. పార్టీలో ఎమ్మెల్యేల తీరు దురుసుగా వుందని క్లాస్ తీసుకున్నారు. ఎమ్మెల్యేలు పాత కొత్త అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్యేలు వుంటారు పోతారని వ్యాఖ్యానించిన కేటీఆర్.. నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉండటం అవసరమని స్పష్టం చేశారు. పార్టీలో నాయకులంతా సమన్వయంతో పని చేసుకోవాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సమన్వయం చేసుకోవాలని.. పువ్వాడ అజయ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మంత్రి అని.. కేవలం ఖమ్మంకు మాత్రమే మంత్రి అనుకోవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు. నియాజకవర్గాల వారీగా అభివృద్ది పనులకు సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్కు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అందజేశారు. రాబోయే పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి తీరాలని ఆయన నేతలకు దిశానిర్ధేశం చేశారు. కొంతకాలంగా జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.