Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరోనా వ్యాక్సినేషన్ వికటించి ఓ అంగన్ వాడి టీచర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వ్యాక్సిన్ తీసుకున్న ఆంగన్ వాడి టీచర్ వాంతులు జ్వరంతో ఇబ్బంది పడుతుండడంతో హుటాహుటిన హుజురాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన అంగన్ వాడి టీచర్ సింగిరెడ్డి సరోజన కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా ఈనెల 19న టీకా తీసుకున్నారు. రాత్రి నుంచి తల తిప్పినట్లుగా వాంతులు చేసుకోవడంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అప్రమత్తమై అంబులెన్స్లో హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సరోజన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.