Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆస్ట్రేలియా పర్యటన నుంచడి భారత జట్టు భారత్ కు చేరుకుంది. అందులో ముంబయికి చేరుకున్న ఐదుగురు భారత క్రికెట్ జట్టు సభ్యులను ఏడు రోజుల పాటు క్వారంటైన్ చేశారు. రోహిత్ శర్మతోపాటు ఐదుగురు టీమిండియా సభ్యులు ఆస్ట్రేలియా పర్యటన నుంచి ముంబైలోని శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగివచ్చారు. ముంబై విమానాశ్రయంలో భారత జట్టు క్రికెటర్లకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని కోరినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ చెప్పారు. వచ్చే ఏడు రోజుల పాటు ఆటగాళ్లు ఇంటి నిర్బంధంలో ఉండాలని సూచించాం' అని చాహల్ చెప్పారు. భారత క్రికెట్ జట్టు స్టాండ్ ఇన్ కెప్టెన్ రహానే, ఆటగాళ్లు రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, పృథ్వీ షా, ప్రధాన కోచ్ రవిశాస్త్రిలు ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ లో విజయం సాధించాక గురువారం ఉదయం ముంబైలో అడుగుపెట్టారని బీసీసీఐ అధికారులు చెప్పారు.