Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయి. ఐదు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. పగటి సమయంలో ఎండతీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్శీదేవిపల్లి, గిరిమెల్లపాడు, ఇల్లందులో 39.3 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని టీఎస్డీపీఎస్ తెలిపింది. రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని అర్లి(టి)లో 15.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. ప్రధానంగా తూర్పు, ఈశాన్య దిశనుంచి గాలులు వీస్తున్నాయని, దీంతో పొడి వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.