Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పొలానికి వెళ్లిన రైతును దారుణంగా చంపేశారు.
బొంరాస్ పేట మండల పరిధిలోని మెట్లకుంట గ్రామానికి చెందిన కుర్వ చంద్రయ్య(52) ఆదివారం పొలానికి వెళ్లాడు. సాయంత్రమైనా అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా అతడి ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు కంప్లయింట్ చేశారు. బొంరాస్ పేట పోలీసులు చంద్రయ్య కోసం గాలించారు. గ్రామంలోని ఎల్లమ్మ చెరువు దగ్గర తల లేకుండా చంద్రయ్య డెడ్ బాడీని గుర్తించారు. హత్య చేసిన నిందితులు చంద్రయ్య తలను వేరు చేసి చెరువులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.