Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో 10వ తరగతి చదివే రాము అనే విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో వెంటనే రాముని కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయుడు టీసీ ఇవ్వడంతో మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. దీంతో నల్లమడుగు తండాలో తన నివాసంలో రాము ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం.