Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. అమెరికాకు వెళ్తున్న దంపతుల బ్యాగులో బుల్లెట్లు లభించాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా గురజాలకు చెందిన దంపతులు బుధవారం ఉదయం అమెరికాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో లగేజ్ను స్కానింగ్ చేస్తుండగా వారి బ్యాగ్లో బుల్లెట్లను గుర్తించారు. దీంతో ఆ బుల్లెట్లను ఇమిగ్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం ఆ దంపతులను పోలీసులకు అప్పగించారు.