Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరోనా వల్ల బార్లకు జనం రాకపోవడంతో మేనేజ్మెంట్లు స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాయి. బిజినెస్ దెబ్బతినడంతో నష్టాల నుంచి గట్టెక్కేందుకు ధరలు తగ్గిస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా బార్లలో ఎమ్మార్పీకే మద్యం అమ్ముతున్నారు. కొన్నిచోట్ల కొన్ని బ్రాండ్లపై 2+1 ఆఫర్లు ఇస్తున్నారు. రెండు పెగ్గులు కొంటే, ఒక్కటి ఫ్రీ పోస్తున్నారు. కరోనాతో పోయినేడాది మార్చి నుంచి అక్టోబర్ వరకు బార్లు మూతపడ్డాయి. వైన్స్ కు ముందే పర్మిషన్ ఇచ్చిన సర్కార్.. బార్లకు మాత్రం ఆలస్యంగా అక్టోబర్ లో అనుమతి ఇచ్చింది. బార్లు ఓపెన్ అయినంక, మొదట గిరాకీనే లేదు. ఆ తర్వాత కాస్త పెరిగినా పెద్దగా బిజినెస్ లేదు. కరోనా సోకుతుందనే భయంతో జనం బార్లకు రావడానికి భయపడుతున్నారు. మరోవైపు మళ్లీ కరోనా విజృంభిస్తోందనే వార్తలు రావడం, సర్కార్ లిక్కర్పై 20 శాతానికి పైగా రేట్లు పెంచడంతో జనం పెద్దగా బార్లకు వెళ్లడం లేదు. ఎక్కువ మంది వైన్స్ లలోనే మందు కొంటున్నారు.
బిజినెస్ పెంచుకునేందుకు బార్ల ఓనర్లు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. జనాన్ని ఆకట్టుకునేందుకు స్పెషల్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. సాధారణంగా వైన్స్లో కంటే బార్లలో రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఒక్కో ఫుల్ బాటిల్పై రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా తీసుకుంటారు. ఒక పెగ్పై రూ.10 నుంచి రూ.15 వరకు ఎక్కువగా ఉంటుంది. బీరుపై రూ.10 నుంచి రూ.20 ఎక్స్ట్రా తీసుకుంటారు. కానీ గిరాకీ లేకపోవడంతో ప్రస్తుతం ఎమ్మార్పీకే అమ్ముతున్నారు. కొన్ని బార్లలో 2+1 ఆఫర్లు ఇస్తున్నారు.