Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కర్ణాటకలో పెండ్లీలో విషాదం చోటు చేసుకుంది. వరుడితో ఆనందంగా తాళి కట్టించుకున్న వధువు పెండ్లి బట్టల్లోనే కుప్పకూలి మృతి చెందింది. ఈ ఘటన కర్ణాటకలోని అడ్యార్ పట్టణలో చోటుచేసుకుంది. ఆదివారం (ఫిబ్రవరి 28) రోజున అడ్యార్ మసీదులో లైలా అఫియా అనే 23 ఏండ్ల యువతికి, ముబారక్ అనే యువకుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. లైలాతోపాటు ఆమె సోదరుడి వివాహం కూడా అదే వేదికపై, అదే సమయంలో వివాహం చేసుకున్నాడు. అతిథులందరూ వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు. అదేరోజు సాయంత్రం వధూవరులు, వారి కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు వధువు లైలా ఇంటికి వెళ్లారు. రాత్రంతా వధూవరులతో కలిసి ఇరుకుటుంబాల వాళ్లు సందడి చేశారు. ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేశారు. అయితే అందరితో కలిసి సందడి చేస్తూ అర్ధరాత్రి తర్వాత పెండ్లి కుమార్తె లైలా ఛాతిలో నొప్పిగా ఉందంటూ ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. లైలా మృతికి గుండెపోటే కారణమని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.