Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదంటూ సుప్రీంకోర్టు నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ అభిప్రాయంతో విభేదించినంత మాత్రనా దేశద్రోహంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తిపై రూ. 50 వేల జరిమానా కూడా విధించింది. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై గతంలో ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై పిటిషన్ దాఖలైంది. జమ్ముకశ్మీర్కు ఉన్న ప్రత్యేక హోదాను భారత ప్రభుత్వం రద్దు చేయడంపై ఫరూక్ అబ్దుల్లా పాకిస్థాన్, చైనా మద్దతు కోరినట్లు పిటిషనర్ ఆధారాలు సమర్పించలేకపోయారని సుప్రీంకోర్టు చెప్పింది.