Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఊపిరి ఆడని కొవిడ్ రోగులకు.. ఆక్సిజన్ అందని వ్యాధిగ్రస్తులకు మాత్రమే రెమ్డిసివిర్ ఇంజెక్షన్ వాడాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో .. చాలా మంది రోగులకు ఊపిరాడక చనిపోతున్నారు. దీంతో రెమ్డిసివిర్ ఇంజెక్షన్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఇంజెక్షన్లను పరిమితంగా, అవసరాన్ని బట్టి వాడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను కేవలం హాస్పిటళ్లకు మాత్రమే సరఫరా చేయాలని, కెమిస్టులు కానీ రోగులకు ఆ ఇంజెక్షన్లను నేరుగా సరఫరా చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. హాస్పిటల్లో చేరిన రోగుల్లో ఎవరికైతే తక్కువ స్థాయిలో ఆక్సిజన్ అందుతుందో వారికి మాత్రమే రెమిడెసివిర్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఇంటి వాతావరణంలో రెమ్డిసివిర్ను వాడవద్దు అంటూ నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు.