Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బేగంబజార్లో టీఆర్ఎస్ నేత శాంతిదేవి వీరంగం సృష్టించారు. మంగళవారం రాత్రి 8 గంటలకు షాప్లు మూసివేయాలని హంగామా చేశారు. ఫ్లై వుడ్ షాప్ మూసివేయాలంటూ షాప్ ఓనర్పై శాంతిదేవి దాడికి పాల్పడ్డారు. ప్రశ్నించిన షాప్ ఓనర్పై శాంతిదేవి అనుచరులు దాడి చేశారు. శాంతిదేవి అనుచరుల దాడి దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. దాడిపై షాపు ఓనర్... బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.